ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nizamabad: చిరుతను తప్పించబోయి..

ABN, Publish Date - Jun 27 , 2024 | 03:07 AM

అర్ధరాత్రి హఠాత్తుగా రోడ్డుపైకి వచ్చిన ఓ చిరుతను తప్పించబోగా కారు బోల్తా కొట్టింది.. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా.. కారు నడుపుతున్న ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

  • కారు బోల్తా పడి భార్య మృతి.. భర్తకు తీవ్రగాయాలు

  • నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌లో దుర్ఘటన

  • చిరుతను తప్పించబోయి కారు బోల్తా

మోపాల్‌, జూన్‌ 26: అర్ధరాత్రి హఠాత్తుగా రోడ్డుపైకి వచ్చిన ఓ చిరుతను తప్పించబోగా కారు బోల్తా కొట్టింది.. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా.. కారు నడుపుతున్న ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలం యాచారం గ్రామానికి చెందిన ప్రభాకర్‌ వ్యాపారం చేస్తూ కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. భార్య లలిత (30)కు కొంతకాలంగా ఆరోగ్యం బాగలేకపోవడంతో ప్రభాకర్‌ మంగళవారం రాత్రి యాచారం నుంచి నిజామాబాద్‌కు కారులో తీసుకెళ్లి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెకు చికిత్స చేయించాడు.


అదే రాత్రి తిరిగి వెళ్తుండగా.. మార్గమధ్యలో మోపాల్‌ మండలం ఎల్లమ్మకుంట గ్రామ అటవీ ప్రాంతంలో హఠాత్తుగా రోడ్డుపై చిరుత ఎదురుగా వచ్చింది. దీంతో దాన్ని తప్పించబోయిన ప్రభాకర్‌.. ఎదురుగా ఉన్న బండరాయిని ఢీకొట్టడంతో కారు బోల్తా పడింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న కొందరు గిరిజనులు ప్రమాదాన్ని చూసి వెంటనే వీరిని నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే లలిత మరణించిందని వైద్యులు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ ప్రభాకర్‌ చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి కూడా విషమంగానే ఉందని సమాచారం.

Updated Date - Jun 27 , 2024 | 03:07 AM

Advertising
Advertising