ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: తిరుమల సంప్రోక్షణ..

ABN, Publish Date - Sep 21 , 2024 | 04:44 AM

తిరుమల శ్రీవారి వారి లడ్డూలో వాడకూడని పదార్థాలను వినియోగించిన నేపథ్యంలో లడ్డూలు తయారు చేసే పోటుతో పాటు, నెయ్యి భద్రపరిచిన ప్రదేశాలను సంప్రోక్షణ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

  • ఆలయ శుద్ధికి ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశం

  • మంత్రులు, సీఎస్‌తో అత్యవసర భేటీ

  • టీటీడీ ఈవోతో రెండుసార్లు టెలీకాన్ఫరెన్స్‌

  • భక్తుల విశ్వాసాన్ని కాపాడతామని హామీ

తిరుమల శ్రీవారి వారి లడ్డూలో వాడకూడని పదార్థాలను వినియోగించిన నేపథ్యంలో లడ్డూలు తయారు చేసే పోటుతో పాటు, నెయ్యి భద్రపరిచిన ప్రదేశాలను సంప్రోక్షణ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. టీటీడీ ఈవో, అధికారులతో శుక్రవారం రెండుసార్లు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దీనికి ముందు.. గత వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో నాణ్యతా లోపాలు, అపవిత్ర పదార్థాల వాడకంపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.


లడ్డూ తయారీ విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవో శ్యామలరావును సీఎం ఆదేశించారు. తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్‌లతో చర్చలు జరుపుతామని ప్రకటించారు. భక్తుల విశ్వాసాలను, ఆలయ సాంప్రదాయాలను కాపాడతామని హామీ ఇచ్చారు. తిరుమల సంప్రోక్షణకు సంబంధించిన విధివిధానాలు తెలియజేసేలా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టింది.

Updated Date - Sep 21 , 2024 | 04:44 AM