ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: బక్రీద్‌ వేడుకల్లో సీఎం..

ABN, Publish Date - Jun 18 , 2024 | 04:20 AM

బక్రీద్‌ పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌ బర్కత్‌పురలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. సోమవారం రాత్రి గోల్కొండ సిగరెట్‌ ఫ్యాక్టరీ ఎండీ నవాబ్‌ మహబూబ్‌ ఆలం ఖాన్‌ నివాసంలో బక్రీద్‌ వేడుకలకు ఆయన హాజరయ్యారు.

  • నవాబ్‌ మహబూబ్‌ ఆలం ఖాన్‌ నివాసానికి రేవంత్‌..

  • హాజరైన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మాజీ మంత్రులు జానా, షబ్బీర్‌

బర్కత్‌పుర/హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): బక్రీద్‌ పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌ బర్కత్‌పురలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. సోమవారం రాత్రి గోల్కొండ సిగరెట్‌ ఫ్యాక్టరీ ఎండీ నవాబ్‌ మహబూబ్‌ ఆలం ఖాన్‌ నివాసంలో బక్రీద్‌ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలంఖాన్‌ కుటుంబ సభ్యులకు సీఎం బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. అన్వర్‌ ఉల్‌ ఉలూమ్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ సెక్రెటరీ నవాబ్‌ ముజాహిద్‌ ఆలం ఖాన్‌ తదితర కుటుంబ సభ్యులతో కలిసి ఆయన భోజనం చేశారు.


అనంతరం వారితో ఫొటోలు దిగారు. అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యే జైవీర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ ఖైరతాబాద్‌ జిల్లా అధ్యక్షుడు రోహిన్‌ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌ యాదవ్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2024 | 04:20 AM

Advertising
Advertising