ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gandhi Bhavan: వైఎస్సార్‌కు సీఎం రేవంత్‌ నివాళి

ABN, Publish Date - Sep 03 , 2024 | 04:47 AM

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళి అర్పించారు.

హైదరాబాద్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళి అర్పించారు. సోమవారం సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇటు గాంధీభవన్‌లోనూ వైఎస్సార్‌ చిత్రపటానికి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి తదితరులు నివాళులర్పించారు.


  • వైఎ్‌సకు జగన్‌, షర్మిల వేర్వేరుగా నివాళి

పులివెందుల: వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా అన్నాచెల్లెలు జగన్‌, షర్మిల వేర్వేరుగా తండ్రికి నివాళులు అర్పించారు. సోమవారం ఇడుపులపాయలో వైఎస్‌ ఘాట్‌ వద్ద ముందుగా మాజీ ముఖ్యమంత్రి జగన్‌ వైఎస్‌ ఘాట్‌కు చేరుకుని నివాళులు అర్పించారు. ఆయనతో పాటు సతీమణి భారతి, తల్లి విజయమ్మ, తదితరులు పాల్గొన్నారు. జగన్‌ వెళ్లిన 15 నిమిషాలకు ఆయన సోదరి, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వైఎస్‌ ఘాట్‌కు చేరుకుని తండ్రికి నివాళులు అర్పించారు. తల్లి విజయమ్మ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2024 | 04:47 AM

Advertising
Advertising