ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Warangal: మద్యం మత్తులో చెరువులో నిద్రించిన వ్యక్తి

ABN, Publish Date - Jun 11 , 2024 | 04:28 AM

హనుమకొండ రెడ్డిపురం చెరువు వద్ద సోమవారం మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన పనికి పోలీసులతో పాటు స్థానికులు అవాక్కయ్యారు. సుమారు ఐదు గంటలపాటు అతడు కదలకుండా చెరువు నీటిలో పడుకోవడంతో మృతదేహం అనుకుని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

  • మృతదేహం అనుకుని పోలీసులకు సమాచారం

  • బయటకు లాగగా లేచి నిలబడడంతో అంతా అవాక్కు

వరంగల్‌ క్రైం, జూన్‌ 10: హనుమకొండ రెడ్డిపురం చెరువు వద్ద సోమవారం మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన పనికి పోలీసులతో పాటు స్థానికులు అవాక్కయ్యారు. సుమారు ఐదు గంటలపాటు అతడు కదలకుండా చెరువు నీటిలో పడుకోవడంతో మృతదేహం అనుకుని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని చేయిపట్టి బయటకు లాగే ప్రయత్నం చేయగా ఒక్క ఉదుటన లేచి నిలబడడంతో అంతా నివ్వెరపోయారు. తన పేరు శ్రీనివాస్‌ అని, తాను ఏపీలోని పీఎ్‌సఆర్‌ నెల్లూరు జిల్లా కావలికి చెందిన వాడినని పోలీసులకు తెలిపాడు.


తాను కాజీపేటలోని ఓ గ్రానైట్‌ కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాని, ఎండ వేడికి తట్టుకోలేక చెరువులో నిద్రిస్తే బయటకు ఎందుకు లాగారని పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. కాజీపేటకు వెళ్లేందుకు తన వద్ద డబ్బులు లేవని రూ.50 ఇవ్వాలని పోలీసులనే అడగడంతో వారు అతడిని మందలించి అక్కడి నుంచి పంపించేశారు.

Read more!

Updated Date - Jun 11 , 2024 | 04:28 AM

Advertising
Advertising