ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hayath Nagar : రీల్స్‌ మోజు..యువకుడి బలి

ABN, Publish Date - Jul 22 , 2024 | 04:41 AM

ఆ యువకుల ఇన్‌స్టా రీల్స్‌ మోజు వారి తల్లిదండ్రులకు తీవ్ర శోకం మిగిల్చింది. వర్షంలో బైక్‌పై స్టంట్లు చేస్తూ జారిపడి ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్‌ శివారు పెద్ద అంబర్‌పేటలో ఈ ఘటన జరిగింది.

  • వర్షంలో బైక్‌పై స్టంట్లు చేస్తూ జారి పడి మృతి

  • పెద్ద అంబర్‌పేట్‌లో ఘటన

హయత్‌నగర్‌, జూలై 21 (ఆంధ్ర జ్యోతి): ఆ యువకుల ఇన్‌స్టా రీల్స్‌ మోజు వారి తల్లిదండ్రులకు తీవ్ర శోకం మిగిల్చింది. వర్షంలో బైక్‌పై స్టంట్లు చేస్తూ జారిపడి ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్‌ శివారు పెద్ద అంబర్‌పేటలో ఈ ఘటన జరిగింది. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం కోనాపురం గ్రామానికి చెందిన మేడ శివ (18) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు.

శనివారం సాయంత్రం వర్షం కురుస్తున్న సమయంలో అతడు తన స్నేహితుడు సంపత్‌తో కలిసి పెద్ద అంబర్‌పేట్‌ జేసీబీ జంక్షన్‌లో రీల్స్‌ కోసం కేటీఎం బైక్‌పై స్టంట్లు చేస్తున్నాడు. వీరి స్టంట్లను మరో బైక్‌పై నుంచి వారి స్నేహితులు వీడియో తీస్తున్నారు. ఈ క్రమంలో అదుపుతప్పి జారి కిందపడగా వెనుక కూర్చున్న శివ తలకు దెబ్బతగలడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌ నడుపుతున్న సంపత్‌కు తీవ్రగాయాలవడంతో స్నేహితులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శివ మృతి చెందిన విషయం తెలియడంతో అతని తల్లిదండ్రులు సంఘటనా స్థలికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 22 , 2024 | 04:41 AM

Advertising
Advertising
<