Share News

AP News: పోలీసుల క్విక్ రియాక్షన్.. 12 గంటల్లోనే హెచ్‌డీఎఫ్‌ఎసీ ఉద్యోగి అరెస్ట్

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:40 PM

Andhrapradesh: సంచలనం సృష్టించిన రెండున్నర కోట్ల నగదు దోపిడీ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. కేవలం 12 గంటల్లోనే ఎంతో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాఎస్పీ నరసింహ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ...హెచ్‌డీఎఫ్‌సీకి సంబంధించిన హిటాచీ ప్రైవేట్ సంస్థ ఉద్యోగులు అశోక్ కుమార్, రాజబాబు లు ప్రతీరోజు ఏటీఎంలలో నగదు నింపుతారని తెలిపారు.

AP News:  పోలీసుల క్విక్ రియాక్షన్.. 12 గంటల్లోనే హెచ్‌డీఎఫ్‌ఎసీ ఉద్యోగి అరెస్ట్
HDFC Bank East Godavari

రాజమండ్రి, జూలై 27: సంచలనం సృష్టించిన రెండున్నర కోట్ల నగదు దోపిడీ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. కేవలం 12 గంటల్లోనే ఎంతో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ...హెచ్‌డీఎఫ్‌సీకి (HDFC Bank) సంబంధించిన హిటాచీ ప్రైవేట్ సంస్థ ఉద్యోగులు అశోక్ కుమార్, రాజబాబు లు ప్రతీరోజు ఏటీఎంలలో నగదు నింపుతారని తెలిపారు. మధ్యాహ్నం సమయంలో అశోక్ కుమార్ రూ.2.20 కోట్ల నగదుతో పరారయ్యాడననారు. ఐదు పోలీస్ బృందాలతో గాలించామని... కొత్తపేటలో సిప్ట్ కారును వదిలి సెల్‌ఫోన్ విడిచి పెట్టి పరారైనట్లు గుర్తించామన్నారు.

Telangana Assembly: హరీష్ vs మంత్రులు.. దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ..!


కుటుంబ సభ్యులతో మాట్లాడి నిందితుడ్ని పట్టుకున్నామని తెలిపారు. 50 వేలు కారు అద్దెకు ఇచ్చారన్నారు. రూ.2.20 కోట్లు నిందితుడు నుంచి రికవరీ చేశామన్నారు. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా రికవరీ చేశామని తెలిపారు. నిందితుచి 12 గంటల లోపే పట్టుకున్నామని తెలిపారు. నిందితుడు నాలుగేళ్ల నుంచి హిటాచీ సంస్థలో పని చేస్తున్నాడని.. విలాసవంతానికి అలవాటుపడి రెండు వారాలుగా దోపిడీకి పధకం చేసుకున్నాడన్నారు. ప్రతీరోజూ ఏటీఎంలలో నగదు పిల్ చేయటం వల్ల ఎక్కువ డబ్బుతో వ్యాపారం చేయాలనే కోరికతో ఇలాంటి దారుణానికి పాల్పడినట్లు ఎస్పీ వెల్లడించారు. నిందితుడిని మండపేట సమీపంలో పట్టుకున్నట్లు చెప్పారు. బ్యాంక్‌లు ఏటీఎంలలో నగదు నింపే బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తున్నారని.. బ్యాంక్‌లను కూడా జీపీఎస్‌తో అనుసంధానం చేస్తామన్నారు. సీసీ కెమెరాలు కూడా అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్తులో పోలీస్ ప్రజలకు మరింత దగ్గరవుతుందని... రాత్రిపూట రోడ్లుపై తిరిగే నేరస్తులను కట్టడి చేస్తామని ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడించారు. పోలీసుల క్విక్ రియాక్షన్‌పై అభినందనలు వెల్లువెత్తున్నాయి.

Telangana: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రేపు వైన్స్ బంద్.. కారణమిదే..!


ఇదీ జరిగింది...

బీఆర్ అంబేదక్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరంపురం మండలానికి చెందిన వాసంశెట్టి అశోక్ కుమార్ హెచ్‌డీఎస్‌సీలో ఉద్యోగం చేస్తున్నాడు. అశోక్‌ కుమార్ ఏటీఎంలలో నగదు నింపే ఉద్యోగి. ఈ క్రమంలో ఎప్పటిలాగే తోటి సిబ్బందితో కలిసి దానవాయిపేట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి రెండున్నర కోట్లు నగదు తీసుకొని ఏటీఎంలలో నగదు నింపేదుకు అశోక్ బయలుదేరాడు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన 19 ఏటీఎంలలో రెండున్నర కోట్ల రూపాయలు ఫిల్లింగ్ చేయాల్సి ఉంది. అయితే మార్గమధ్యలోనే తోటి సిబ్బంది కళ్లుగప్పి నిందితుడు నగదుతో ఉడాయించాడు. విషయం తెలిసిన బ్యాంకు అధికారులు నిందితుడిపై రాజమండ్రి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అశోక్‌కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టి 12 గంటలలోపే నిందితుడు అశోక్‌ను అరెస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

YS Jagan : అసెంబ్లీపై అలిగిన జగన్‌

AP News: రూ.2.20 కోట్లతో బ్యాంకు ఉద్యోగి పరార్.. పట్టిస్తే భారీ బహుమతి

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 27 , 2024 | 01:41 PM