ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Ponguleti: నూతన రెవెన్యూ చట్టం-2024 తీసుకువస్తున్నాం..

ABN, Publish Date - Aug 19 , 2024 | 09:37 PM

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా రాత్రికి రాత్రే తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు, బాధలకు త్వరలోనే చరమగీతం పాడబోతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రైతులకు భూమి చిక్కులు లేకుండా చేసే ఆదర్శవంతమైన నూతన రెవెన్యూ చట్టం-2024 తీసుకువస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా రాత్రికి రాత్రే తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు, బాధలకు త్వరలోనే చరమగీతం పాడబోతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రైతులకు భూమి చిక్కులు లేకుండా చేసే ఆదర్శవంతమైన నూతన రెవెన్యూ చట్టం-2024 తీసుకువస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతు సుభిక్షంగా ఉండాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. నూతన రెవెన్యూ చట్టం ముసాయిదాపై సోమవారం రోజున టూరిజం ప్లాజాలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా) ఏర్పాటు చేసిన చర్చావేదిక కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


భావి తరాలకు ఇబ్బంది లేకుండా రెవెన్యూ చట్టం..

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. “చట్టాలు సరిగ్గా చేయకపోతే, వాటి ఫలితాలు ఎలా ఉంటాయో గత ప్రభుత్వం తీసుకువచ్చిన 2020 రెవెన్యూ చట్టమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. గతంలో మాదిరిగా జరగకుండా ఉండేందుకు ఒక రోజు ఆలస్యమైనా సమస్యలను పరిష్కరించడంతోపాటు భవిష్యత్తు తరాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చట్టాన్ని రూపొందిస్తున్నాం. సామాన్యుడి నుంచి మేధావి వరకు అన్నీ వర్గాల అభిప్రాయాలను తీసుకోవడానికి ముసాయిదా చట్టాన్ని పబ్లిక్ డొమైన్‌లో పెట్టడంతోపాటు ఇటువంటి చర్చావేదికలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మార్పు కావాలని తెలంగాణ ప్రజానీకం కోరుకున్నారు. ఆ మార్పుకు ధరణి నాంది పలికింది. మనం భౌతికంగా ఉన్నా లేకున్నా, అధికారంలో ఉన్నా లేకున్నా మనం తీసుకొచ్చిన చట్టాలు పదిమందికి ఉపయోగపడేలా శాశ్వతంగా ఉండేలా రూపొందించాలి. ఆ దిశగా మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.


ముందు చూపు లేకుండా వీఆర్‌వో, వీఏవో వ్యవస్థ రద్దు..

ఎలాంటి ప్రత్యామ్నాయ ఆలోచన చేయకుండా కేసీఆర్ తనకు నచ్చలేదనే ఉద్దేశంతో వీఆర్‌వో, వీఏవో వ్యవస్థను ఉన్నపళంగా రద్దు చేసి మొత్తంగా గ్రామస్థాయిలో రెవెన్యూ, భూ పరిపాలన చూసే యంత్రాంగం లేకుండా చేసింది. రైతులకు, ప్రజలకు రెవెన్యూ అధికారులు అందుబాటులో లేకుండా పోయారు. అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలుపుతామని ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మేము ఇచ్చిన హామీని విశ్వసించి తెలంగాణ ప్రజానీకం మాకు అధికారం అప్పగించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం. సమాజ ప్రగతిని నిర్దేశించే ప్రధాన అంశాలలో అన్నీ వర్గాల ఆలోచనలు, అభిప్రాయాలు, పెద్దల సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోకపోతే ఎటువంటి సంస్కరణ అయినా శూన్యగతికే చేరుకుంటుందనటానికి నిలువెత్తు నిదర్శనం ధరణి.


ఉద్యోగ సంఘాలు కలిసి రావాలి..

రెవెన్యూ వ్యవస్థను కంటికి రెప్పలా కాపాడే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత ఉంది. గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ, రెవెన్యూ కోర్టులు తీసుకువస్తాం. ఆ వ్యవస్థను తిరిగి బలోపేతం చేస్తాం. అలాగే రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కార విషయంలో సానుకూలంగా వ్యహరిస్తాం. త్వరలోనే ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ఇద్దరు మాత్రమే పని చేస్తే సాధ్యం కాదు. రెవెన్యూ ఉద్యోగులందరూ సమష్టిగా నిబద్ధతతో జవాబుదారీతనంతో పనిచేస్తేనే అది సాధ్యమవుతుంది” అని అన్నారు.

Updated Date - Aug 19 , 2024 | 09:37 PM

Advertising
Advertising
<