ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ponnam Prabhakar: కాళేశ్వరం నుంచి ఎన్ని టీఎంసీల నీటిని ఇచ్చారు..?

ABN, Publish Date - Jul 25 , 2024 | 06:59 PM

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కరీంనగర్ జిల్లాకు ఎన్ని టీఎంసీల నీటిని రైతులకు ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ప్రశ్నించారు. BRS నాయకులు తమ జిల్లాలో ఉన్న లోయర్, మిడ్ మానేరు డ్యామ్ పరిశీలనకు వెళ్తున్నారని తెలిపారు.

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కరీంనగర్ జిల్లాకు ఎన్ని టీఎంసీల నీటిని రైతులకు ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ప్రశ్నించారు. BRS నాయకులు తమ జిల్లాలో ఉన్న లోయర్, మిడ్ మానేరు డ్యామ్ పరిశీలనకు వెళ్తున్నారని తెలిపారు. 2టీఎంసీల నీటి కోసం తీసుకున్న ప్రణాళిక ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు కాలేదని ప్రశ్నించారు. ఈరోజు(గురువారం) సెక్రటేరియట్ మీడియా పాయింట్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... రెండు టీఎంసీల నీరు రాలేదు కానీ రూ. 2 వేల కోట్లతో మూడో టీఎంసీ నీటి గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.


వర్షాకాలంలో నీళ్లు వస్తున్నాయి.. కానీ తాము కడితేనే వస్తున్నాయని చెప్పుకునే ప్రయత్నం బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్లంపల్లి, మిడ్ మానేర్ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వెళ్తాయన్నారు. ముంపు గ్రామాల సమస్య ఎందుకు పరిష్కరించలేదో చెప్పి రావాలని అడిగారు. అధికారంలో ఉన్నప్పుడు నిర్వాసితులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. మూడో టీఎంసీ నీటిని ఎవరి లబ్ధి కోసం అడుగుతున్నారో చెప్పాలని నిలదీశారు. యాదవులకు ఉన్న బకాయిలను తాము అధికారంలోకి వచ్చాక తమ జిల్లాల్లో ఇప్పుడు పరిష్కారిస్తున్నామని అన్నారు. 7 నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని.. మరి పదేళ్ల ప్రభుత్వంపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. యాదవులకు చెందిన 8500 డీడీలు గత ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. తెలంగాణ గురించి మాజీ సీఎం కేసీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెడితే బాగుండేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.


మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) సందర్శించేందుకు ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత వారు బయలుదేరినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ నుంచి భారీ ర్యాలీగా ప్రత్యేక బస్సుల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లారు. కాళేశ్వరం చేరుకుని మొదటగా LMD రిజర్వాయర్ సందర్శించనున్నారు. అనంతరం గురువారం రాత్రి రామగుండంలో బీఆర్ఎస్ నేతల బృందం బస చేయనుంది. శుక్రవారం (రేపు) 10 గంటలకు కన్నెపల్లి పంపు హౌజ్, 11గంటలకు మేడిగడ్డ బ్యారేజీ‌లను వారు సందర్శిస్తారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.


కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కాళేశ్వరంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని గులాబీ నేతలు మండిపడుతున్నారు. ప్రాజెక్టు పగుళ్లు, ఇసుకలో కూరుకుపోతోందంటూ చేసే ప్రచారాలు మానుకోవాలని హితవు పలుకుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆధ్వర్యంలోనూ బృందం పర్యటనకు వెళ్లనుండటంతో రాజకీయంగా ఆసక్తి వాతావరణం నెలకొంది.

Updated Date - Jul 25 , 2024 | 07:01 PM

Advertising
Advertising
<