ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tammineni: ఆక్రమణలు మొత్తం కూల్చివేయాలి.. తమ్మినేని కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Aug 24 , 2024 | 02:47 PM

ఎక్కడ అక్రమాలు ఉన్న కూల్చివేయడం మంచి నిర్ణయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. హైడ్రాపై సీపీఎం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు.

Tammineni Veerabhadram

హైదరాబాద్: ఎక్కడ అక్రమాలు ఉన్న కూల్చివేయడం మంచి నిర్ణయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) వెల్లడించారు. హైడ్రాపై సీపీఎం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో ఈరోజు(శనివారం) మీడియాతో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ... గతంలో బీఆర్ఎస్ మాదిరి కాకుండా.. ఆక్రమణలు మొత్తం కూల్చివేయాలని చెప్పారు. ఆక్రమణలు చేస్తున్న వారికి అనుమతించిన అధికారులను కూడా శిక్షించాలని చెప్పుకొచ్చారు.


భూమాత పోర్టల్‌పై రైతుల్లో చర్చ పెట్టాలని అన్నారు. రుణమాఫీని పక్క దోవ పట్టించటానికి మంత్రులు, సీఎంలు, మాజీ సీఎంలు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అందరికీ రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రూ. 2లక్షలు రుణమాఫీ చేస్తే రూ.31,000 కోట్లు ఖర్చు అవుతుందని కాంగ్రెస్ నాయకులు చెప్పారని తమ్మినేని వీరభద్రం అన్నారు.


ఇప్పుడు రూ. 18,000 కోట్లు రుణమాఫీ చేసి పూర్తిగా రుణమాఫీ అయ్యింది అంటే ఎలా? అని ప్రశ్నించారు. రుణమాఫీకి రేషన్ కార్డు అవసరం లేదని రేవంత్ రెడ్డి నోటి మాట చెప్పారని అన్నారు. కానీ రుణమాఫీ కావాలంటే అధికారులు రేషన్ కార్డు అడుగుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సీఎం పర్యటనలు ఉంటే తమ సీపీఎం నేతలను ముందస్తు అరెస్ట్ చేశారని తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు.


ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలు ఉంటే కూడా ముందస్తు గా సీపీఎం నేతలను అరెస్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులకు ఇచ్చిన హామీలుఅమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 29తేదీన రెవెన్యూ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తున్నామని తమ్మినేని వీరభద్రం తెలిపారు.


మాజీ సీఎం కేసీఆర్ అవలంభించిన విధానాలను కాంగ్రెస్ కొనసాగాస్తుందని ఆరోపించారు. రెండు గ్రామాల్లో రుణమాఫీపై స్టడి మని తెలిపారు. 1100 మందికి 300మందికి మాత్రమే రుణమాఫీ అయ్యిందని తెలిపారు. కాంగ్రెస్.‌ బీజేపీని వదిలేసి బీఆర్ఎస్ వెంట పడుతుందని తెలిపారు. దీని వల్ల కాంగ్రెస్ నష్ట పోతుందని.. గతంలో కూడా బీఆర్ఎస్ ఇలాగే నష్టపోయిందని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.


బీజేపీవి మతతత్వ ఆలోచనలు: బీవీ రాఘవులు

బీజేపీ మతతత్వ ఆలోచనలను కొనసాగిస్తుందని సీపీఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు (B V Raghavulu) తెలిపారు. వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరణ చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారని అన్నారు. వక్ఫ్ బోర్డు చట్టంలో అభ్యంతరకరమైన మార్పులు తీసుకు రావాలని బీజేపీ చూస్తుందని విమర్శలు చేశారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో ఈరోజు(శనివారం) మీడియాతో రాఘవులు మాట్లాడుతూ... వక్ఫ్ బోర్డులో ఇతర మతస్తులను కమిటీలో పెట్టాలని చూస్తున్నారని విమర్శలు చేశారు. మతాల మధ్య విభజన తేవాలని బీజేపీ చూస్తోందని ఆరోపణలు చేశారు.


రాబోయే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ కుట్రకు పాల్పడుతోందని విమర్శించారు. ఉత్తరాఖండ్‌లో తీసుకువచ్చిన బిల్లు చాలా ఘోరంగా ఉందని అన్నారు. దేశంలో అగ్రీస్ యాక్ట్ అమలు చేయాలని కేంద్రం చూస్తుందని అన్నారు. ఈ యాక్ట్‌తో రైతుల డేటా అంత ప్రైవేట్ కంపెనీల పరం అవుతుందని అన్నారు. నల్ల చట్టాలను పరోక్షంగా అమలు చేయాలని బీజేపీ పనిగట్టుకుందని ధ్వజమెత్తారు. భూ మాత పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకువస్తుందని ఆరోపించారు. భూ మాతపై రైతులలో చర్చ పెట్టిన తర్వాత అమలు చేయాలని బీవీ రాఘవులు డిమాండ్ చేశారు.

Updated Date - Aug 24 , 2024 | 02:58 PM

Advertising
Advertising
<