ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Holiday: గుడ్ న్యూస్.. ఆ రోజున సెలవు ప్రకటించిన సర్కార్..

ABN, Publish Date - Sep 14 , 2024 | 07:48 AM

తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వినాయక నిమజ్జనం సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. స్కూళ్లు, కాలేజీలు, ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. 9 రోజులు పూజలందుకున్న గణపయ్య..

Govt Holiday

హైదరాబాద్, సెప్టెంబర్ 14: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వినాయక నిమజ్జనం సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. స్కూళ్లు, కాలేజీలు, ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. 9 రోజులు పూజలందుకున్న గణపయ్య.. సెప్టెంబర్ 17వ తేదీన గంగమ్మ ఒడికి చేరనున్నాడు. నిమజ్జనం కార్యక్రమం నేపథ్యంలో ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. భద్రతా పరంగా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న సర్కార్.. నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్ పరిసరాల్లో భారీ క్రేన్స్‌ని అందుబాటులో ఉంచుతోంది.


గణేష్‌ నిమజ్జనంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. అదే సమయంలో ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించారు. గణేష్‌ నిమజ్జనానికి 25 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో గణేష్‌ నిమజ్జనం జరుగుతుందన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఖైరతాబాద్‌ గణేష్ నిమజ్జనం మధ్యాహ్నం 1:30 గంటలలోపు పూర్తి అవుతుందని తెలిపారు. ఈ ఏడాది అదనంగా 10 శాతం వినాయక విగ్రహాలు ఏర్పాటు అయ్యాయన్నారు. అన్నిరకాల విగ్రహాలు కలిపి దాదాపు లక్ష వరకు ఉండొచ్చన్నారు. నాలుగు రోజులుగా హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయన్నారు.


నిబంధనలు ఇవే..

గణేష్ నిమజ్జన శోభాయాత్రల నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీసులు శుక్రవారం కీలక నిబంధనలు ప్రకటించారు. నిమజ్జనం రోజున పాటించాల్సిన ముందస్తు నియమాలను వెల్లడించారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు విగ్రహాలను తీసుకెళ్లడానికి అవసరమైన వాహనాన్ని ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిమజ్జనం రోజున సౌత్ జోన్ పరిధుల నుంచి విగ్రహాలను తీసుకెళ్లేవారు ముందుగానే బయలుదేరాలని, వాహనానికి ఏసీపీ కేటాయించిన నంబర్‌ను ప్రదర్శించాలని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీసులు ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు.


  • ఒక గణేష్ విగ్రహానికి ఒక వాహనం మాత్రమే అనుమతి ఉంటుంది.

  • విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంపై లౌడ్ స్పీకర్‌ను అమర్చకూడదు.

  • నిమజ్జనం రోజు వాహనాలపై డీజేతో కూడిన మ్యూజికల్ సిస్టమ్‌కు అనుమతి లేదు.

  • రంగులు చల్లుకునేందుకు కాన్ఫెట్టి తుపాకులను ఉపయోగించకూడదు.

  • విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంలో మద్యం లేదా మరేదైనా మత్తుమందులు సేవించిన వ్యక్తులకు అనుమతి ఉండదు.

  • రోడ్డుపై వాహనం వెళ్లేటప్పుడు ట్రాఫిక్‌ను ప్రభావితం చేయకూడదు.

  • ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించకూడదు.

  • విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనం ఇతర వాహనాలకు, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే ఏదైనా ప్రార్థనా స్థలం దగ్గర లేదా మార్గంలో ఆపకూడదు.

  • అప్పటి పరిస్థితులను బట్టి పోలీసు అధికారులు ఇచ్చే ఆదేశాల మేరకు వాహనాల కదలికలు ఆధారపడి ఉంటాయి.

  • ఊరేగింపులో ఎవరూ కర్రలు/కత్తులు, కాల్పులు ఆయుధాలు, మండే పదార్థాలు లేదా ఇతర ఆయుధాలను తీసుకెళ్లకూడదు.

  • జెండాలు లేదా అలంకారాల కోసం ఉపయోగించే కర్రలు 2 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉండకూడదు.

  • వెర్మిలియన్, కుంకుమ లేదా గులాల్‌లను బాటసారులపై వేయకూడదు

  • ఊరేగింపులో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు/రెచ్చగొట్టే ప్రసంగాలు/నినాదాలు లేదా రెచ్చగొట్టే సంకేతాలు లేదా బ్యానర్లు ఉపయోగించకూడదు. జనాలలో ఏ వర్గానికి చెందిన వారి మనోభావాలను దెబ్బతీసే ఇతర రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదు.

  • ఊరేగింపు సమయంలో బాణాసంచా ఉపయోగించకూడదు.

  • పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలను పాటించాలి.

  • ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే 100కి డయల్ చేసి సమాచారం ఇవ్వాలి.


Also Read:

18 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ హెచ్చరిక

వినిపించడం లేదా మణిపూర్‌ రోదన?

ఇంకా జగన్‌ జపమేనా

For More Telangana News and Telugu News..

Updated Date - Sep 14 , 2024 | 07:48 AM

Advertising
Advertising