ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kaleswaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై మొదలైన జ్యుడీషియల్ ఎంక్వైరీ..

ABN, Publish Date - Apr 03 , 2024 | 12:04 PM

కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ ఎంక్వైరీ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో స్పెషల్ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇరిగేషన్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ అధికారుల బృందం నిన్న ఘోష్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యింది.

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project)పై జ్యుడీషియల్ ఎంక్వైరీ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో స్పెషల్ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇరిగేషన్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ అధికారుల బృందం నిన్న ఘోష్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ప్రభుత్వం కమిషన్ ఏర్పాటుకు విడుదల చేసిన గెజిట్ ప్రతులను ఘోష్‌కు రాహుల్ బొజ్జ అందించారు. 9 అంశాలతో వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఘోష్ మిషన్ లేఖ రాసింది. జూన్ చివరి వారం నాటికి విచారణ పూర్తి చేయాలని ఘోష్ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. వచ్చే వారంలో ఘోష్ కమిషన్ బృందం హైదరాబాద్‌కు రానుంది.

Hyderabad: ‘అయ్యో’మయం.. ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‏లో గందరగోళం

కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణ లోపాలు, అవకతవకలపై విచారణ జరిపి, బాధ్యులను గుర్తించాలని జ్యుడీషియల్‌ విచారణ కమిటీని కోరేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఈ మేరకు మంగళవారం కోల్‌కతాలో కమిటీ చైర్మన్‌ అయిన జస్టిస్‌ పినాకి చంద్రఘో్‌షను నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా నేతృత్వంలోని అధికారుల బృందం కలవనుంది. ఇప్పటికే రాహుల్‌బొజ్జాతో పాటు ఈఎన్‌సీ (ఓఅండ్‌ఎం) బి.నాగేంద్రరావు, డిప్యూటీ ఈఎన్‌సీ (పీఅండ్‌ఎం) కె.శ్రీనివాస్‌ కోల్‌కతాకు చేరుకున్నారు. మంగళవారం అపాయింట్‌మెంట్‌ ఉండటంతో ఆయన్ను కలిసి, టీవోఆర్‌ అందించి, కేసును వివరించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడి బూర్గుల రామకృష్ణారావు భవన్‌ (బీఆర్‌కేఆర్‌)లో విచారణ కమిటీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఏడు అంశాల ఆధారంగా విచారణ జరిపి, దోషులెవరో గుర్తించి, జూన్‌ 30లోపు నివేదిక అందించాలని ఘోష్‌ను అధికారులు కోరనున్నారు.

Hyderabad: భానుడి భగభగలు.. గ్రేటర్‌ పరిధిలో 41-42 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు

ఆ ఏడు అంశాలేంటంటే...

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంతో పాటు ప్లానింగ్‌, డిజైనింగ్‌లో లోపాలు, అవకతవకలు, నిర్లక్ష్యంపై విచారణ చేపట్టాలి

కాంట్రాక్టర్లకు పని అప్పగింత, పనుల అమలు తీరు, అవకతవకలు, ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా కాంట్రాక్టర్లకు పనుల అప్పగింతకు కారకులను గుర్తించాలి

3 బ్యారేజీల్లో ఆపరేషన్‌ మెయింటెన్స్‌లో నిర్లక్ష్యానికి బాధ్యులైన వారితో పాటు బ్యారేజీలు దెబ్బతినడానికి గల కారణాలను తేల్చాలి

క్వాలిటీ కంట్రోల్‌, పర్యవేక్షణ కోణంలో నిర్లక్ష్యం, కాంట్రాక్టర్లు/ఏజెన్సీలు, శాఖలోని అధికారుల తప్పిదాలపై విచారణ జరపాలి

నిబంధనలకు విరుద్ధంగా పనులు పూర్తి చేయడానికి పొడిగింపులు (ఎక్స్‌టెన్షన్‌ ఆఫ్‌ టైమ్‌-ఈవోటీ), పనులు పూర్తయినట్లు కాంట్రాక్టర్లకు సర్టిఫికెట్లు ఇవ్వడం, గడువు కన్నా ముందే బ్యాంకు గ్యారెంటీలను విడుదల చేయడం, కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించడం వంటి అంశాల్లో బాధ్యులైన అధికారులను గుర్తించాలి

కోరిన అన్ని అంశాల్లో బాధ్యులను గుర్తించడం, దానివల్ల ఖజానాపై పడిన ఆర్థిక భారం, ఆర్థిక నష్టాలు, ఏజెన్సీల పాత్రను నిగ్గుతేల్చాలి

ఇంకా ఇతర ఏమైనా అంశాలు ప్రభుత్వం సిఫారసు చేస్తే.. వాటిపై విచారణ చేయాలి..

KTR: తాగునీటి కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కొరత: కేటీఆర్‌

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 03 , 2024 | 12:04 PM

Advertising
Advertising