ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sanjay Kumar: జగన్‌ అక్రమాస్తుల కేసు.. విచారణ నుంచి తప్పుకొన్న న్యాయమూర్తి

ABN, Publish Date - Aug 15 , 2024 | 02:48 AM

ఏపీ మాజీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు విచారణ నుంచి జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ తప్పుకొంటున్నట్టు ప్రకటించారు.

న్యూఢిల్లీ, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ఏపీ మాజీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు విచారణ నుంచి జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. జగన్‌ అక్రమాస్తుల కేసులకు సంబంధించి నమోదైన సీబీఐ కేసుల్లో తీర్పు వెలువడిన తర్వాతే ఈడీ కేసుల్లో తీర్పులు ఇవ్వాలని గతంలో తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సీబీఐ, ఈడీ కేసులను విడివిడిగా లేదా సమాంతరంగా విచారించినా ఆ పద్థతినే అనుసరించాలని అప్పట్లో స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును గతేడాది మే నెలలో ఈడీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది.


బుధవారం ఈడీ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే.. కేసు ప్రారంభమైన వెంటనే తాను విచారణ నుంచి తప్పుకొంటున్నానని జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. వాదనలు వినిపించేందుకు ఇరుపక్షాల న్యాయవాదులు సిద్థమవగా జస్టిస్‌ సంజీవ్‌ కుమార్‌ లేని ధర్మాసనం ముందు పిటిషన్‌ను లిస్ట్‌ చేయనున్నట్టు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా వెల్లడించారు. సెప్టెంబరు 2 నుంచి మొదలయ్యే వారంలో సీజేఐ ఆదేశాల మేరకు మరో ధర్మాసనం ముందు లిస్ట్‌ చేయాలని ఆయన ఆదేశించారు.

Updated Date - Aug 15 , 2024 | 02:48 AM

Advertising
Advertising
<