Share News

Dinner Party: ఈ నేతలకు రేపు గ్రాండ్ డిన్నర్ పార్టీ..వీరికి మాత్రమేనా?

ABN , Publish Date - Jun 07 , 2024 | 01:40 PM

తెలంగాణ(telangana)లో కొత్తగా ఎంపికైన కాంగ్రెస్ ఎంపీలకు(congress mps) శుభవార్త వచ్చేసింది. అది ఏంటంటే రేపు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలకు డిన్నర్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు.

Dinner Party: ఈ నేతలకు రేపు గ్రాండ్ డిన్నర్ పార్టీ..వీరికి మాత్రమేనా?
Mallikarjun Kharge dinner party

తెలంగాణ(telangana)లో కొత్తగా ఎంపికైన కాంగ్రెస్ ఎంపీలకు(congress mps) శుభవార్త వచ్చేసింది. అది ఏంటంటే రేపు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలకు డిన్నర్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge) ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎంపీలకు టీపీసీసీ సమాచారం ఇచ్చింది. దీంతో తెలంగాణ నుంచి గెలిచిన ఎనిమిది మంది ఎంపీలు డిన్నర్ పార్టీకి రానున్నారు. దీంతోపాటు రేపు మధ్యాహ్నం తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుండగా.. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి సహా CWC సభ్యులు, ఏఐసీసీ నేతలు, సీనియర్ నేతలు హాజరుకానున్నారు. వీరు కూడా ఆ పార్టీలో భాగం కానున్నట్లు తెలుస్తోంది.


ఈ సమావేశం నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి సమాలోచనలు చేయనున్నారు. పార్టీ ఓడిపోయిన స్థానాలు, గెల్చుకున్న స్థానాల కారణాలను విశ్లేషించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పార్టీకి పిలవని నేతల్లో కూడా అసంతృప్తి నెలకొనే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. గెల్చిన వారిని మాత్రమే పిలవడం సరికాదని అంటున్నారు. అయితే ప్రతి ఏటా కూడా పార్లమెంట్ స్థానాలను గెల్చిన అభ్యర్థులకు ఆయా పార్టీలు విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అంతకుముందు కూడా మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) పలు సమావేశాల సందర్భంగా రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలకు విందు ఏర్పాటు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Dipadas Munshi: నాంపల్లి కోర్టుకు హాజరైన దీపాదాస్ మున్షి

చంద్రబాబును కలిసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు.. (ఫోటో గ్యాలరీ)

టీచర్ల అక్రమ బదిలీలకు బ్రేక్..

Read Latest Telangana News and National News

Updated Date - Jun 07 , 2024 | 01:42 PM