ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Siddipet: సిద్దిపేటలో ఔరా అనిపిస్తోన్న అక్కాచెల్లెళ్లు.. ఒకేసారి..

ABN, Publish Date - Oct 16 , 2024 | 11:44 AM

సిద్దిపేట నర్సాపూర్‌కు చెందిన కొంక రామచంద్రం (శేఖర్), శారద దంపతులకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె మమత ఎంబీబీఎస్ పూర్తిగా చేయగా.. రెండో కుమార్తె ఎంబీబీఎస్ తుది సంవత్సరం చదువుతోంది. మరో ఇద్దరు పిల్లలు సైతం తాజాగా ఎంబీబీఎస్ సీటు సాధించి ఔరా అనిపిస్తున్నారు.

సిద్దిపేట: జిల్లాకు చెందిన అక్కాచెల్లెళ్లు అద్భుతం చేశారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా నలుగురు అక్కాచెల్లెళ్లు వైద్యులుగా మారేందుకు సిద్ధమయ్యారు. సిద్దిపేట పట్టణం నర్సాపూర్‌కు చెందిన కొంక రామచంద్రం (శేఖర్), శారద దంపతులకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. రామచంద్రానికి రాజు అనే సోదరుడు ఉండేవాడు. అయితే అతను 1992లో జరిగిన ఓ రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. ఆ తర్వాత ఆయన తల్లి మల్లవ్వ గొంతు క్యాన్సర్‌తో మృతిచెందారు. దీంతో రామచంద్రం తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తన ఇంట్లో ఒక్క డాక్టరైనా ఉండి ఉంటే తల్లి, సోదరుడిని కాపాడుకునే వాడిని కదా అనుకున్నారు. తన నలుగురు పిల్లల్లో ఒక్కరినైనా వైద్యురాలిని చేయాలని సంకల్పించారు. ఏళ్ల తరబడి భార్యభర్తలు ఇద్దరూ దర్జీలుగా పని చేస్తూ పిల్లలను బాగా చదివించారు.


అయితే పెద్ద కుమార్తె మమత ఇటీవల ఎంబీబీఎస్ పూర్తిగా చేసింది. రెండో కుమార్తె మాధురి కరీంనగర్‌లోని చెల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాలలో తుది సంవత్సరం చదువుతోంది. మరో ఇద్దరు పిల్లలు రోహిణి(అక్క), రోషిణి(కవలలు) సైతం తాజాగా ఎంబీబీఎస్ సీటు సాధించి ఔరా అనిపించారు. నీట్- 2024లో రోహిణికి 536 మార్కులు రాగా, రోషిణికి 587 మార్కులు వచ్చాయి. వీరిద్దరూ జగిత్యాల మెడికల్ కళాశాలలో సీటు సాధించారు. నీట్- 2023లోనే రోహిణికి సీటు వచ్చింది. అయితే రోషిణికి మాత్రం రాలేదు. దీంతో చెల్లి బాధపడుతుందని ఆమె కళాశాలలో చేరలేదు. ఇద్దరూ కలిసి ఈసారి అదరగొట్టారు. మంచి మార్కులు సాధించి ఒకే కళాశాలలో సీటు పొందారు. త్వరలో నలుగురూ డాక్టర్లు కాబోతుండడంతో తల్లిదండ్రులు, బంధువుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.


అయితే తమను చదివించేందుకు తల్లిదండ్రులు చాలా కష్టపడుతున్నారని, వారి నమ్మకాని ఒమ్ము చేయబోమని అక్కాచెల్లెళ్లు చెప్తున్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వారు మా ఇష్టాన్ని కాదనకుండా ఎంబీబీఎస్ చదవిస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ముగ్గురికీ పెద్ద అక్కనే రోల్ మోడల్ అంటున్నారు. అందరం కలిసి అమ్మానాన్న కల సాకారం చేస్తారని చెప్తున్నారు. పిల్లలు హైదరాబాద్‌లో చదవడంతో చాలా మంది అనేక రకాల మాటలు అనేవారని, వాటిని పట్టించుకోకుండా లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగుతున్నట్లు రామచంద్రం దంపతులు అంటున్నారు. తమ పిల్లలను సరస్వతీ పుత్రులు అని పలువురు కొనియాడుతున్నారని, ఆ మాటలు వింటున్నప్పుడు తమ కష్టాన్ని మర్చిపోతున్నట్లు ఆనంద భాష్పాలు రాల్చారు. ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా వారిని డాక్టర్లగా నిలబెడతామని అంటున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ఈ కుటుంబం గురించే చర్చ జరుగుతోంది. పిల్లలు అంటే ఇలా ఉండాలని పలువురు తల్లిదండ్రులు అనుకుంటున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Karimnagar: కరీంనగర్‌లో విషాదం.. డాక్టర్లు చెప్పిన వార్త విని..

BRS: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కీలక సమావేశం నేడు..

CM Revanth Reddy: సీఎం సంతకం చేసినా బదిలీల్లేవ్‌!

Updated Date - Oct 16 , 2024 | 11:56 AM