ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Janagaon District: పద్మావతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు

ABN, Publish Date - Aug 12 , 2024 | 05:00 AM

సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళుతున్న పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు జనగామ జిల్లాలో ఆదివారం పెను ప్రమాదం తప్పింది.

  • జనగామ జిల్లాలో తెగిపడ్డ హైటెన్షన్‌ విద్యుత్‌ తీగ

చిలుపూర్‌, ఆగస్టు 11 : సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళుతున్న పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు జనగామ జిల్లాలో ఆదివారం పెను ప్రమాదం తప్పింది. పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రైలు జనగామ జిల్లా వంగాలపల్లి రైల్వేగేటు సమీపంలోకి రాగానే పైనున్న హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్‌ తెగిపోయింది. దీంతో రైలు ఒక్క ఉదుటున ఆగిపోయింది.


ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. సమాచారమందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్‌ వైర్లకు మరమ్మతులు చేసి రైలును కాజీపేట వైపు పంపించారు. ఈ క్రమంలో 40 నిమిషాలకుపైగా రైలు రాకపోలకు అంతరాయం ఏర్పడింది. రైలు గేటు వద్ద నిలిచిపోవడంతో పరిసర గ్రామాల ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు.

Updated Date - Aug 12 , 2024 | 05:00 AM

Advertising
Advertising
<