ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: జూకంటి జగన్నాథంకు దాశరథి పురస్కారం..

ABN, Publish Date - Jul 21 , 2024 | 04:58 AM

అభ్యుదయ కవి దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఏటా ఇచ్చే పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ కవి, రచయిత జూకంటి జగన్నాథంకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

  • రేపు కృష్ణమాచార్య జయంతి సందర్భంగా సత్కారం

హైదరాబాద్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): అభ్యుదయ కవి దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఏటా ఇచ్చే పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ కవి, రచయిత జూకంటి జగన్నాథంకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాశరథి జయంతిని పురస్కరించుకుని సోమవారం ఏర్పాటు చేసే కార్యక్రమంలో జూకంటిని సర్కారు సత్కరించనుంది.


ఈ సందర్భంగా ఆయనకు రూ.1,01,116 నగదు బహుమతితో పాటు జ్ఞాపికను అందజేస్తుంది. పురస్కారానికి ఎంపికైన జూకంటి జగన్నాథంకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి జూకంటి స్వగ్రామం. 2020 సంవత్సరానికి గాను జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి జాతీయ కవిత పురస్కారాన్ని అందుకున్నారు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు

Updated Date - Jul 21 , 2024 | 04:58 AM

Advertising
Advertising
<