ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Construction Delay: ఉప్పల్‌ కారిడార్‌ పనులు కదిలేనా!

ABN, Publish Date - Aug 04 , 2024 | 03:46 AM

పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థకు ఆర్థిక చిక్కులు, మరోవైపు అధికారుల అలసత్వంతో ఆరు లేన్ల ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణంలో తీవ్ర జాప్యం రాజ్యమేలుతోంది. 2018 జూన్‌లో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు దక్కించుకున్న కంపెనీ 24 మాసాల్లోనే పూర్తి చేయాలని ఒప్పందంలో ఉంది.

  • నాలుగేళ్ల క్రితమే పూర్తి కావాల్సినా.. తీవ్ర జాప్యం

  • గడ్కరీ ఆదేశాలతో ఎన్‌హెచ్‌ఏఐ కసరత్తు

  • నేడు కోమటిరెడ్డి పరిశీలన

హైదరాబాద్‌, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థకు ఆర్థిక చిక్కులు, మరోవైపు అధికారుల అలసత్వంతో ఆరు లేన్ల ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణంలో తీవ్ర జాప్యం రాజ్యమేలుతోంది. 2018 జూన్‌లో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు దక్కించుకున్న కంపెనీ 24 మాసాల్లోనే పూర్తి చేయాలని ఒప్పందంలో ఉంది. కానీ వివిధ కారణాలు చూపుతూ పనులను ఆలస్యం చేయగా, గత రెండేళ్ల నుంచి అసలు పనులే నిర్వహించడం లేదు. దాంతో రూ.626.76 కోట్లతో చేపట్టిన 6.25 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు నిలిచిపోయాయి. ఉప్పల్‌ జంక్షన్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లినపుడు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయ్యారు. ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌పై చర్చించారు.


కొత్త కంపెనీకి పనులు అప్పగించాలని లేదంటే నిలిచిపోయిన పనులతో పాటు, ప్రాజెక్టును పూర్తిచేసేందుకు మరోసారి టెండర్లు ఆహ్వానించాలని కోరారు. దీంతో గడ్కరీ ప్రాజెక్టు పూర్తికి ఎలా ముందుకెళ్లాలో తెలపాలని జాతీయ ఎన్‌హెచ్‌ఏఐ తెలంగాణ విభాగం అధికారులను కోరారు. ఈ నేపథ్యంలో కేంద్రానికి నివేదిక అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా, ఇప్పటివరకు 44 శాతం పనులే పూర్తయ్యాయి. మొత్తం 143 పిల్లర్లకు 137 పూర్తయ్యాయి. పిల్లర్లపై నిర్మించాల్సిన 142 స్పాన్లలో 36 మాత్రమే పూర్తయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఇప్పటికైనా కారిడార్‌ పనుల్లో కదలిక వస్తుందా అనే చర్చ మొదలైంది. కాగా, ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ అసంపూర్తి పనులను మంత్రి కోమటిరెడ్డి ఆదివారం పరిశీలించనున్నారు. ఎన్‌హెచ్‌ఏఐ, జాతీయ రహదారుల శాఖతో పాటు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ అధికారులతో పనుల నిర్వహణ పలు అంశాలపై చర్చించనున్నారు.

Updated Date - Aug 04 , 2024 | 03:46 AM

Advertising
Advertising
<