ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nalgonda: కన్న కొడుకులే కాలయములు

ABN, Publish Date - Aug 26 , 2024 | 04:40 AM

కన్న కొడుకులే వాళ్ల పాలిట కాలయములయ్యారు. తాగిన మైకంలో కసాయిల్లాగా మారారు. ఒకడు తల్లి గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ తరువాత అదే కత్తితో తనూ గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

  • నల్లగొండ జిల్లా నిడమనూరులో మద్యం

  • మత్తులో తల్లి గొంతు కోసిన శివకుమార్‌

  • అదే కత్తితో గొంతుకోసుకొని ఆత్మహత్య

  • పాలమూరు జిల్లా సల్కర్‌పేటలో తల్లి

  • తలపై మోది, గొంతు కోసిన కృష్ణయ్య

  • ఖర్చులకు డబ్బులడిగితే ఇవ్వలేదని..

నిడమనూరు/గండీడ్‌, అగస్టు 25: కన్న కొడుకులే వాళ్ల పాలిట కాలయములయ్యారు. తాగిన మైకంలో కసాయిల్లాగా మారారు. ఒకడు తల్లి గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ తరువాత అదే కత్తితో తనూ గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకడు డబ్బు ఇవ్వలేదన్న కోపంతో ఇనుపరాడ్డుతో తన తల్లి తలపై మోది, గొంతుకోసి చంపేశాడు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రం, మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడు మండల పరిధిలోని సల్కర్‌పేట్‌ గ్రామంలో ఈ రెండు ఘటనలు జరిగాయి.


నిడమనూరు మండల కేంద్రానికి చెందిన రావిరాల వీరయ్య, సాయమ్మ(65) దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. గ్రామంలో ఆ వృద్ధ దంపతులు పాలు విక్రయించి జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడు శ్రీనివాస్‌ మిర్యాలగూడలో టైలరింగ్‌ వృత్తి చేసుకుంటున్నాడు. చిన్న కుమారుడు శివకుమార్‌(36) కారు డ్రైవరుగా పనిచేస్తూ తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. శివకుమార్‌కు తన మేనకోడలితో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఓ కుమార్తె పుట్టి చనిపోయింది.


భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడంతో పెద్దమనుషుల సమక్షంలో రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. కోర్టులో కూడా విడాకుల కేసు నడుస్తోంది. ఈ క్రమంలో శివ మద్యానికి బానిసయ్యాడు. మరోవైపు, అతడు విడాకులిచ్చిన మహిళకు శనివారం వేరే వ్యక్తితో వివాహం జరిగింది. ఆ పెళ్లికి శివకుమార్‌ తండ్రి, సోదరుడు వెళ్లారు. దీన్ని శివకుమార్‌ జీర్ణించుకోలేకపోయాడు. శనివారం రాత్రి బాగా మద్యం తాగి.. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి వెళ్లాడు. నిద్రపోతున్న తల్లితో గొడవ పడి కత్తితో కిరాతకంగా గొంతుకోశాడు. రక్తపు మడుగులో విలవిలలాడుతూ ఆ వృద్ధురాలు అక్కడికక్కడే చనిపోయింది. తల్లిని చంపిన భయంతో అటూ ఇటూ పరుగులు పెడుతూ తాను కూడా అదే కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


  • గొంతుకోసి.. పొదల్లో పడేసి..

మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడు మండలం సల్కర్‌పేట్‌కు చెందిన వెంకటమ్మ(55) తన కుమారుడు కృష్ణయ్యతో కలిసి ఉంటోంది. ఊర్లో ఇటీవలే కొత్త ఇంటి నిర్మాణం చేపట్టింది. ఆ పనులు పూర్తయ్యాక కుమారుడికి పెళ్లి చేయాలని అనుకున్నది. కానీ మద్యానికి బానిసైన కృష్ణయ్య డబ్బుల కోసం తరచూ తల్లితో గొడవపడేవాడు. శనివారం రాత్రి కూడా మద్యం తాగి వచ్చి తల్లితో గొడవపడ్డాడు.


ఆమె ఇవ్వకపోవడంతో ఇనుపరాడ్డుతో ఆమె తలపై మోది, గొంతు కోసి చంపేశాడు. మృతదేహాన్ని లాక్కెళ్లి ఇంటి దగ్గరల్లోని చెట్ల పొదల్లో పడేశాడు. తన తల్లి కనిపించడం లేదని ఆదివారం ఉదయం కాసేపు వెతికాడు. ఆ తర్వాత పొదల్లోని మృతదేహాన్ని అప్పుడే చూసినట్లు ఏడవడం మొదలు పెట్టాడు. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Updated Date - Aug 26 , 2024 | 04:40 AM

Advertising
Advertising
<