ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Crop Insurance: త్వరలో పంటల బీమా!

ABN, Publish Date - Sep 15 , 2024 | 03:56 AM

రాష్ట్రంలో త్వరలో పంటల బీమా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వం పంటల బీమాపై దృష్టి సారించింది.

  • నెలాఖరు వరకు క్లస్టర్ల వారీగా టెండర్లు

  • ప్రీమియం చెల్లింపునకు రూ.2,500కోట్లు

  • బీమా వర్తింపు.. వానాకాలం నుంచా..

  • యాసంగి నుంచా?.. తుమ్మల సమీక్ష

హైదరాబాద్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో త్వరలో పంటల బీమా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వం పంటల బీమాపై దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ‘ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన’ (పీఎంఎ్‌ఫబీవై) పథకం కింద బీమాను రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకు రానుంది. ఇందుకు సంబంధించిన కసరత్తును వ్యవసాయ శాఖ ఇప్పటికే పూర్తిచేయగా త్వరలోనే దీని అమలుకు మార్గం సుగుమం కానుంది. ఇందులో భాగంగానే ఈ నెలాఖరు వరకు టెండర్లను ఆహ్వానించనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే పంటల బీమా కోసం పిలిచే టెండర్లను గంపగుత్తగా కాకుండా క్లస్టర్ల వారీగా పిలవాలని వ్యవసాయ శాఖ నిర్ణయించినట్టు సమాచారం.


అంతేకాకుండా దాదాపు అన్ని పంటలకు బీమాను వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పీఎంఎ్‌ఫబీవైలోని మార్గదర్శకాలను అనుసరించి పంటలకు బీమాను అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో ప్రీమియం చెల్లింపునకు సుమారు రూ.2,500 కోట్ల నిధులు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ ప్రాధమికంగా అంచనా వేస్తోంది. టెండర్ల ప్రక్రియ పూర్తయితే నిధుల అంశంపై స్పష్టత రానుంది. అయితే పంటల బీమాకు చెల్లించాల్సిన రాష్ట్ర వాటా, రైతుల వాటాను కలిపి ప్రభుత్వమే చెల్లించనుంది. రైతులు, రాష్ట్రం వాటాను చెల్లించిన తర్వాత కేంద్రం తన వాటాను జమ చేస్తుంది. పంటల గుర్తింపు, దిగుబడి లెక్కింపునకు సాంకేతికతను వినియోగించనుండగా.. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిసింది. అదే సమయంలో సాంకేతికతతో పాటు ఆఫ్‌లైన్‌ (మాన్యువల్‌) విధానంలోనూ పంటలను గుర్తించనున్నారు.


ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వానలు, వచ్చిన వరదల నేపథ్యంలో వానాకాలంలో సాగైన పంటల్లో సుమారు 4.15లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం గుర్తించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గుర్తించిన పంట నష్టాలకు ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం అందించనుంది. ఈ నేపథ్యంలో పంటల బీమాను వానాకాలం సీజన్‌ నుంచి అమలు చేస్తారా లేక యాసంగి నుంచి అమలుచేస్తారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే వానాకాలం సీజన్‌ ముగిసిందని, ఈ లోపే బీమా పథకం అందుబాటులోకి వచ్చి ఉంటే రైతులకు లబ్ధి చేకూరేదని రైతు సంఘాలు అంటున్నాయి. కాగా ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 1.23కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవ్వగా.. వీటిలో వరి 59.76లక్షల ఎకరాలు, పత్తి 43.29 లక్షల ఎకరాలు, కంది 4.83లక్షలు, మొక్కజొన్న 5.30లక్షల ఎకరాల్లో సాగయ్యాయని ఇటీవల వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో పేర్కొంది.


  • మంత్రి తుమ్మల సమీక్ష

రాష్ట్రంలో పంట బీమా అమలు, వ్యవసాయ శాఖ భవిష్యత్తు కార్యాచరణపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం సచివాల యంలో శాఖ అధికారులతో సమీక్షించారు. పంటల బీమా అమలు, అందుకు తీసుకోవాల్సిన చర్యలు, రైతులకు ప్రయోజనాలకు అనుగుణంగా విధానాలు రూపొందించే అంశంపై చర్చించారని మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

Updated Date - Sep 15 , 2024 | 03:56 AM

Advertising
Advertising