ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tarnaka : కదులుతున్న ప్రైవేటు బస్సులో మహిళపై అత్యాచారం!

ABN, Publish Date - Jul 31 , 2024 | 05:06 AM

ఢిల్లీలో నిర్భయ ఘటనను తలపించేలా హైదరాబాద్‌లో దారుణం జరిగింది. కదులుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో మహిళపై ఆ వాహన డ్రైవర్లలో ఒకడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

  • నిందితుడు ఆ బస్సు అదనపు డ్రైవరే

  • నిర్మల్‌ నుంచి 35 మంది ప్రయాణికులతో ప్రకాశం జిల్లాకు.. అర్ధరాత్రి అఘాయిత్యం

  • బస్సును ఛేజ్‌ చేసి హైదరాబాద్‌లోని తార్నాకలో పట్టుకున్న పోలీసులు

  • ఇద్దరు డ్రైవర్ల అరెస్టు.. బస్సు సీజ్‌

  • నిర్మల్‌లో 9 ఏళ్ల కూతురుతో కలిసి బస్సెక్కిన మహిళ

  • వెనుక సీట్లో తల్లీకూతుళ్లకు సౌకర్యంగా ఉంటుందని సూచన

  • అర్ధరాత్రి ఆమె నోట్లో బెడ్‌షీట్‌ కుక్కి అత్యాచారం

  • ప్రయాణికుల సాయంతో పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు

తార్నాక, జూలై 30 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో నిర్భయ ఘటనను తలపించేలా హైదరాబాద్‌లో దారుణం జరిగింది. కదులుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో మహిళపై ఆ వాహన డ్రైవర్లలో ఒకడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓయూ ఇన్‌స్పెక్టర్‌ రాజేంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం.. హరిక్రిష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు 35 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ నుంచి హైదరాబాద్‌ మీదుగా ప్రకాశం జిల్లా పామూరుకు బయలుదేరింది.

బస్సులో ఇద్దరు డ్రైవర్లు సిద్ధయ్య, కృష్ణ (40) ఉన్నారు. నిర్మల్‌ నుంచి వాహనాన్ని సిద్ధయ్య నడిపాడు. అక్కడ తొమ్మిదేళ్ల కూతురుతో కలిసి 27 ఏళ్ల మహిళ బస్సెక్కింది. అప్పుడే ఆమెపై అదనపు డ్రైవర్‌ కృష్ణ కన్నేశాడు. ఆమె తనకు మాత్రమే టికెట్‌ తీసుకోవడం, కూతురుకు తీసుకోకపోవడాన్ని గమనించి మాటల్లో పెట్టాడు. మధ్య సీట్లలో కాకుండా బస్సు చివరి సీట్లోకి వెళ్లి కూర్చుంటే పాపను పడుకోబెట్టడానికి ఇబ్బంది ఉండదంటూ సలహా ఇచ్చాడు.


అతడు చెప్పినట్లే పాపతో కలిసి ఆమె చివరి సీట్లోకి వెళ్లి పడుకుంది. అర్ధరాత్రి 12:15 గంటలకు బస్సు హైదరాబాద్‌ సమీపంలోకి చేరుకుంది. బస్సులో ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్నారు. ఆ సమయంలో అదనపు డ్రైవర్‌ కృష్ణ, వెనుక సీట్లోకి వెళ్లాడు. అక్కడ బాలికతో కలిసి నిద్రస్తున్న మహిళపై అత్యాచారానికి యత్నించాడు. నిద్రలోంచి లేచిన ఆమె.. షాక్‌లోంచి తేరుకునేలోపే నోట్లో బెడ్‌షీట్‌ను కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు.

అనంతరం.. ఏమీ ఎరగనట్లు బస్సు నడుపుతున్న సిద్ధయ్య వద్దకొచ్చి పక్కసీట్లో కూర్చున్నాడు. కొద్దిసేపటికి దిగ్ర్భాంతి నుంచి తేరుకున్న బాధితురాలు.. తన పట్ల జరిగిన ఘోరాన్ని తోటి ప్రయాణికులతో చెప్పుకొని, వారి సాయంతో డయల్‌-100కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారమిచ్చింది.

అప్రమత్తమైన పోలీసులు ఆ బస్సును ఛేజ్‌ చేసి తార్నాక మెట్రో స్టేషన్‌ వద్ద పట్టుకున్నారు. అప్పటికే నిందితుడు కృష్ణ మెట్టుగూడ చౌరాస్తాలో బస్సులో నుంచి దూకి పారిపోయాడని ప్రయాణికులు చెప్పారు.

బస్సు నడుపుతున్న సిద్ధయ్యను అదుపులోకి తీసుకుని బస్సును సీజ్‌ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు వైద్యపరీక్షల నిమిత్తం బాధితురాలిని గాందీ ఆస్పత్రికి తరలించారు. కృష్ణను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం అతడిని మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుంది.

Updated Date - Jul 31 , 2024 | 05:06 AM

Advertising
Advertising
<