ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maheshwaram: అన్నయ్యా.. నేనూ నీవెంటే..!

ABN, Publish Date - Jun 23 , 2024 | 02:59 AM

ఒకే తల్లి పిల్లలైన ఆ అన్నాచెల్లెళ్లు మరణంలోనూ తమ ప్రేమానుబంధాన్ని చాటుకున్నారు. అన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలిసిన వెంటనే చెల్లెలి గుండె ఆగిపోయింది.

  • అన్న ఆత్మహత్య వార్త విని గుండెపోటుతో చెల్లెలి మృతి

  • రంగారెడ్డి జిల్లా పెద్దపులి నాగారంలో ఘటన

మహేశ్వరం, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): ఒకే తల్లి పిల్లలైన ఆ అన్నాచెల్లెళ్లు మరణంలోనూ తమ ప్రేమానుబంధాన్ని చాటుకున్నారు. అన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలిసిన వెంటనే చెల్లెలి గుండె ఆగిపోయింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెదపులి నాగారం గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. నాగారం గ్రామానికి చెందిన కమ్మరి విఠల్‌చారి(50) పదేళ్లుగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. విఠల్‌చారికి వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలంలో కొంత వ్యవసాయభూమి ఉంది.


ఆ భూమి దగ్గరకు వెళ్లివస్తానని చెప్పి శుక్రవారం ఇంటి నుంచి బయలుదేరిన విఠల్‌చారి తిరిగిరాలేదు. విఠల్‌చారి తన పొలం వద్ద ఓ చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణాలు కోల్పోయి కనిపించాడు. శనివారం ఉదయం విఠల్‌చారి మరణ వార్త తెలుసుకున్న చెల్లెలు అనిత(45) గుండెపోటుతో కన్నుమూసింది. అన్నాచెల్లెళ్లు ఇద్దరు మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.

Updated Date - Jun 23 , 2024 | 02:59 AM

Advertising
Advertising