ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dundigal: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు..

ABN, Publish Date - Jul 20 , 2024 | 03:38 AM

మితిమీరిన వేగం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. దుండిగల్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో శుక్రవారం ఘోర ప్రమాదం సంభవించింది. ఆగివున్న లారీని ఓ కారు ఢీకొట్టింది.

  • ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్థుల దుర్మరణం

  • ఇద్దరికి తీవ్ర గాయాలు.. గండిమైసమ్మ- బౌరంపేట సర్వీసు రోడ్డులో ఘటన

దుండిగల్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): మితిమీరిన వేగం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. దుండిగల్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో శుక్రవారం ఘోర ప్రమాదం సంభవించింది. ఆగివున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ప్రయాణిస్తున్న ఐదుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం వివరాలను పోలీసులు వెల్లడించారు. అక్షయ్‌, హరి, అస్మిత్‌, నవనీత్‌, జశ్వంత్‌ బాచుపల్లిలోని ఓ హాస్టల్లో ఉంటున్నారు. వీరిలో నలుగురు వీఎన్‌ఆర్‌ విజ్ఞాన్‌ జ్యోతి కాలేజీలో, ఒకరు మరో కాలేజీలో ఇంజనీరింగ్‌ చదువుతున్నారు.


శుక్రవారం ఐదుగురు కలిసి టీ తాగేందుకు స్కోడా కారులో దుండిగల్‌ చౌరస్తాకు వెళ్లారు. తిరిగివస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు గండిమైసమ్మ-బౌరంపేట వద్ద అదుపు తప్పి రోడ్డుపక్కన ఆగివున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. తీవ్రగాయాలతో అక్షయ్‌, హరి, అస్మిత్‌ అక్కడికక్కడే మృతి చెందారు. నవనీత్‌, జశ్వంత్‌ గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి, మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Jul 20 , 2024 | 03:38 AM

Advertising
Advertising
<