ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: చిరంజీవితో బండి సంజయ్‌ భేటీ..

ABN, Publish Date - Jun 24 , 2024 | 04:18 AM

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ఆదివారం నటుడు చిరంజీవిని కలిశారు. ఢిల్లీ బయలుదేరే ముందు సంజయ్‌.. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఆయనను చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు. శాలువాతో సత్కరించి.. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

  • మీకు తగిన పదవి లభించిందన్న చిరు

హైౖదరాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ఆదివారం నటుడు చిరంజీవిని కలిశారు. ఢిల్లీ బయలుదేరే ముందు సంజయ్‌.. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఆయనను చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు. శాలువాతో సత్కరించి.. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ‘‘మీరు ఎంతో కష్టపడి పైకొచ్చారు. మీరు కేంద్ర మంత్రి కావడం చాలా ఆనందంగా ఉంది. మీ కృషికి తగిన పదవి లభించింది’’ అని సంజయ్‌ను ఉద్దేశించి చిరంజీవి వ్యాఖ్యానించారు.


ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రధాని మోదీ తమను దగ్గరకు తీసుకుని పలకరించడం మర్చిపోలేని అనుభూతి మిగిల్చిందని చిరంజీవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ స్పందిస్తూ.. ‘నేను విద్యార్థి దశలో మీ సినిమాలకు అభిమానిని’’ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మంచి ఫలితాలను ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రజలకు మంచి పాలన అందిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం వారిద్దరు జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై కొద్దిసేపు ముచ్చటించుకున్నారు.

Updated Date - Jun 24 , 2024 | 04:18 AM

Advertising
Advertising