డిజిటల్ కార్పొరేషన్ పేరుతో జగన్ భారీ మాయ..

ABN, Publish Date - Jun 27 , 2024 | 08:40 AM

అమరావతి: ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ పేరుతో జగన్ ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించి ఔట్‌ సోర్సింగ్‌ పేరుతో అడ్డగోలు పనులు చేశారు. ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌లో 400 మందిని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా కూర్చోబెట్టారు. వారు చేసింది... అచ్చంగా వైసీపీ సేవ!

అమరావతి: ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ పేరుతో జగన్ ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించి ఔట్‌ సోర్సింగ్‌ పేరుతో అడ్డగోలు పనులు చేశారు. ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌లో 400 మందిని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా కూర్చోబెట్టారు. వారు చేసింది... అచ్చంగా వైసీపీ సేవ! సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్‌ చానళ్లు, ఇన్‌స్టా పేజీల్లో అసభ్యకర పోస్టులు పెట్టే పేటీఎం బ్యాచ్‌ ఖర్చు మొత్తం కూడా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల బడ్జెట్‌ పద్దు నుంచే చేశారు. విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్‌’ అని ఇప్పటికీ చక్కటి కబుర్లు చెబుతున్న జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఏం చేశారో తెలుసా... ఒకే ఒక్క ఏడాదిలో రూ.1800 కోట్లకుపైగా ప్రజాధనాన్ని తన ‘సోషల్‌ మీడియా’ ప్రచారానికి ఖర్చు పెట్టేశారు. సజ్జల భార్గవ్‌ రెడ్డి నేతృత్వంలో నడిచిన వైసీపీ సోషల్‌ మీడియా విభాగం... వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన ‘ఐ ప్యాక్‌’ ఖర్చునూ జనంపైనే రుద్దేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే

రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో కొత్త మంత్రులు వీరే..?

ఆ మంత్రికి గైడ్ చేస్తున్నది ఎవరు?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 27 , 2024 | 08:40 AM