టెలిఫోన్ భవన్ చేరుకున్న బడా గణపతి |

ABN, Publish Date - Sep 17 , 2024 | 10:54 AM

ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నవరాత్రులు పూజలు అందుకున్న లంబోదరుడు నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. మంగళవారం ఉదయం 6:15 గంటలకు ఈ శోభాయాత్ర ప్రారంభమైంది.

ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నవరాత్రులు పూజలు అందుకున్న లంబోదరుడు నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. మంగళవారం ఉదయం 6:15 గంటలకు ఈ శోభాయాత్ర ప్రారంభమైంది. ఖైరతాబాద్ చౌరస్తా నుంచి ట్యాంక్ బండ్ వరకూ పెద్ద ఎత్తున సాగుతుంది. ఈ శోభయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.


లక్డీకాపుల్‌లోని టెలిఫోన్ భవన్ మీదుగా ఈ గణేశుడి శోభయాత్ర సాగుతుంది. ఈ యాత్ర సాజావుగా సాగేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఈ శోభయాత్ర సాగే ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అలాగే ఈ యాత్ర సాగే మార్గంలో వందలాది మంది పోలీసులను మోహరించారు.

Updated at - Sep 17 , 2024 | 11:03 AM