GOD : శేష వాహనంపై శ్రీవారి విహారం
ABN, Publish Date - Feb 09 , 2025 | 12:05 AM
స్థానిక కొండమీద రాయు డు స్వామి బ్రహోత్సవా లు అంగరంగ వైభవం గా జరుగుతున్నాయి. ్ఞఅందులో భాగంగా నా లుగో రోజు శనివారం శ్రీదేవి, భూదేవి సమేత స్వామి వారు శేష వాహ నంపై భక్తులకు దర్శనమి చ్చారు.
బుక్కరాయసముద్రం, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): స్థానిక కొండమీద రాయు డు స్వామి బ్రహోత్సవా లు అంగరంగ వైభవం గా జరుగుతున్నాయి. ్ఞఅందులో భాగంగా నా లుగో రోజు శనివారం శ్రీదేవి, భూదేవి సమేత స్వామి వారు శేష వాహ నంపై భక్తులకు దర్శనమి చ్చారు. విద్యుద్దీప కాంతు లతో మంగళవా యిద్యాల నడుమ మధ్య స్వామి వారి ఊరేగింపు శోభా యమానంగా సాగింది. శేషవాహన సేవకు ముం దుగా స్థానిక అంజనేయ స్వామి దేవాలయంలో ఉత్సవ మూర్తలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని పల్లకి సేవ నిర్వహించారు. సాయంత్రం స్థానిక లక్ష్మీనారాయణస్వామి దేవాలయం లో ఉత్సవమూర్తులను శేషవాహనంపై ఆశీనులను చేసి పురువీదుల్లో ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని మొక్కులు మొక్కా రు. స్వామి వారు ఆదివారం హనుమద్వాహనంపై విహరించను న్నట్లు ఆలయకమిటీ సభ్యులు తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Feb 09 , 2025 | 12:05 AM