IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్లు బదిలీ
ABN , Publish Date - Apr 13 , 2025 | 05:41 PM
IAS Officers Transfer: ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ అధికారులును ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.

అమరావతి, ఏప్రిల్ 14: ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఎనిమిది మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ, భూ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఆర్పీ సిసోడియాను హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేసింది. ఇక రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న జయలక్ష్మికి అదనపు బాధ్యతలు అప్పగించింది. అయితే ప్రస్తుతం సీసీఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా జయలక్ష్మి విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
అలాగే ఏపీహెచ్ఆర్డీ డైరెక్టర్గా కాటమనేని భాస్కర్కు అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. ప్రస్తుతం ఐటీ సెక్రటరీగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఇక పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న రేవు ముత్యాలరాజును.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శిక్షణా సంస్థ కమిషనర్గా బదిలీ చేసింది. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న మరో ఐఏఎస్ అధికారి కే. మాధవీలతను రైతుబజార్ల సీఈవోగా బదిలీ చేసింది. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ కార్యదర్శిగా గౌతమిని బదిలీ చేసింది. ఆయుష్ డైరెక్టర్గా దినేష్ కుమార్ నియమించింది. మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్గా నీలకంఠారెడ్డికి బాధ్యతలు కట్టబెట్టింది.
ఈ వార్తలు కూడా చదవండి..
AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు
Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..
TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
For AndhraPradesh News And Telugu News