శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:43 AM
శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఏఆర్.దా మోదర్ ఆదేశించారు. బుధవారం ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో గల గెలాక్సీభవన్లో నెల వారీ నేర సమీక్షా సమావేశం జరిగింది.

ఎస్పీ దామోదర్
ఒంగోలు క్రైం, మార్చి12(ఆంధ్రజ్యోతి): శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఏఆర్.దా మోదర్ ఆదేశించారు. బుధవారం ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో గల గెలాక్సీభవన్లో నెల వారీ నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సం దర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అధికారు లు తమ పరిధిలో ఉన్న ఉన్న గ్రామాలను సం దర్శించి శాంతిభద్రతల సమస్యలు లేకుండా చ ర్యలు చేపట్టాలన్నారు. గ్రీవేన్స్లో వచ్చిన అర్జీల ను చట్టపరిధిలో సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ప్రతి సబ్డివిజన్లో శక్తి టీమ్లను ఏర్పాటు చేయాలని, వారి ద్వారా శక్తి యాప్ను డౌన్లోడ్ చేయించడంతో పాటు మహిళలకు అహగాన కల్పించాలని చెప్పారు. ముఖ్యమైన ప్రాంతాలలో సీసీకెమోరాలు ఏర్పాటు చేసుకునే లా అవగాహన కల్పించాలని కోరారు. పెండింగ్ కేసులపై దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చే యాలన్నారు. గుర్తు తెలియని మృతదేహాలు, అ నుమానాస్పద మృతి కేసులపై అన్ని కోణాలలో దర్యాప్తు చేయాలని కోరారు. సమావేశంలో ఏ ఎస్పీ కె.నాగేశ్వరావు, డీఎస్పీలు శ్రీనివాసరావు, ల క్ష్మీనారాయణ, సాయిఈశ్వర్యశ్వంత్, నాగరాజు, సీఐలు రాఘవేంద్రరావు, దేవప్రభాకర్, సూర్యనా రాయణలతోపాటు జిల్లాలో ఉన్న సీఐలు, ఎస్ఐ లు పాల్గొన్నారు.