వంశీపై అంత ప్రేమ ఎందుకు జగన్?: వర్ల
ABN , Publish Date - Feb 18 , 2025 | 05:54 AM
వంశీని జైల్లో పరామర్శించేందుకు జగన్ వెళ్లడం మహిళలను, దళితులను అవమానించడమేనని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు.

అమరావతి, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): అనేక కేసుల్లో ముద్దాయి, అసాంఘిక శక్తిగా పేరుగాంచి, మహిళల వ్యక్తిత్వ హననం చేసిన వంశీని జైల్లో పరామర్శించేందుకు జగన్ వెళ్లడం మహిళలను, దళితులను అవమానించడమేనని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. వంశీ పట్ల జగన్ చూపిస్తున్న ప్రేమ వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. జగన్కు దళితులంటే చిన్నచూపు అని, అందుకే తన కోసం పనిచేసిన దళిత రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ విజయపాల్ జైలుకు వెళితే ఆయన పరామర్శకు వెళ్లలేదన్నారు.