కన్నుల పండువగా సీతారాముల కల్యాణం
ABN , Publish Date - Apr 07 , 2025 | 12:16 AM
శ్రీరామ నవమిని పురస్కరించుకొని వాడవాడలా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక వేదికలపై సీతారామలక్ష్మణుల ఉత్సవ విగ్రహాలను ఉంచి వివాహ వేడకను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిపారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు ఆయా ఆలయాల్లో సీతమ్మవారు, రాములవారికి పట్టువస్త్రాలు సమర్పించి, కల్యాణోత్సవంలో పాలుపంచుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కల్యాణోత్సవానికి తిలకించారు. మధ్యాహ్నం అన్నసమారాధన నిర్వహించారు. కొన్ని గ్రామాల్లో సాయంత్రం సీతారాముల ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించారు.

శ్రీరామ నవమిని పురస్కరించుకొని వాడవాడలా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక వేదికలపై సీతారామలక్ష్మణుల ఉత్సవ విగ్రహాలను ఉంచి వివాహ వేడకను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిపారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు ఆయా ఆలయాల్లో సీతమ్మవారు, రాములవారికి పట్టువస్త్రాలు సమర్పించి, కల్యాణోత్సవంలో పాలుపంచుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కల్యాణోత్సవానికి తిలకించారు. మధ్యాహ్నం అన్నసమారాధన నిర్వహించారు. కొన్ని గ్రామాల్లో సాయంత్రం సీతారాముల ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించారు.