Business Ideas: ఇండియాలో పోటీలేని టాప్ బిజినెస్ ఇదే.. తక్కువ ఖర్చు.. అధిక లాభాలు..
ABN , Publish Date - Mar 02 , 2025 | 01:20 PM
Business Ideas: తక్కువ పోటీ ఉండే వ్యాపారాలు కొన్నే ఉంటాయి. అందులో ఇదే టాప్ బిజినెస్. కానీ ఇలాంటి వ్యాపారం ఒకటి ఉందని.. ఇది మొదలుపెడితే తిరుగులేని వ్యాపారవేత్తగా ఎదగవచ్చని చాలా తక్కువ మందికే తెలుసు. పెద్దగా పెట్టుబడి పెట్టకుండానే ఈ వ్యాపారం మొదలుపెట్టి కోట్లలో సంపాదిస్తున్నాడు ఓ వ్యక్తి. మరి, ఆ బిజినెస్ ఐడియా ఏంటో మీరూ తెలుసుకోండి.

Business Ideas: ఈ కంపెనీ ప్రారంభిస్తే వ్యాపారవేత్తగా మీకు లాభాల పంట పండటం ఖాయం. ఇదొక్కటేనా.. పర్యావరణవేత్తగానూ అందరూ మిమ్మల్ని ఆకాశానికెత్తేస్తారు. 140కోట్లకు పైగా జనాభా ఉన్న ఇండియాలో ప్రతి రోజూ వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగవుతుంటాయి. కంప్యూటర్లు, ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, ఫ్యాన్లు, ఫ్రిజ్లు, కూలర్లు, ప్రింటర్లు, స్కానర్లు ఇలా ఎన్నో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు(e-waste) పెద్ద మొత్తంలోనే పేరుకుపోతున్నాయి. వీటిని రీసైకిల్ చేసే బిజినెస్ స్టార్ట్ చేస్తే కోట్లలో ఆదాయం రావడం ఖాయం. ఎందుకంటే, మన దేశంలో ఇలాంటి కంపెనీలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. మీరు చేయాల్సిన పనల్లా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే.. మరి, ఈ బిజినెస్ ఎలా మొదలుపెట్టాలంటే..
చెత్త బిజినెస్తో.. కోట్ల ఆదాయం..
ప్రస్తుతం భారతదేశంలో ఒక రోజులోనే 26 వేల టన్నులకు పైనే ప్లాస్టిక్ వ్యర్థాలు పోగవుతున్నాయి. ఇందులో దాదాపు సగం రీసైక్లింగ్ చేయకుండా వదిలేస్తున్నారు. ఎలక్ట్రానిక్ వేస్ట్ (e-waste) కూడా ఏటా సుమారు 20 లక్షల టన్నులు వస్తోంది. ఈ వేస్టోజ్ మొత్తాన్ని సేకరించడమే మీరు చేయాల్సిన ముఖ్యమైన పని. ఈ విషయంలో మీరు సఫలమైతే ఈ వ్యాపారంలో వెనుతిరిగి చూడాల్సిన అవసరం ఎప్పటికీ రాదు. ఇందుకు రాజస్థాన్కు చెందిన రాజ్ కుమార్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఐటీ రంగం కారణంగా పెరిగిపోతున్న ఈ- వేస్ట్ రీసైకిల్ కావట్లదనే ఆవేదనతో.. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో తాను భాగం కావాలనుకున్నాడు. ఉద్యోగం వదులుకుని మరీ మొదట రాజస్థాన్లోని కుష్ఖేరాలో ఒక ప్లాంట్.. తర్వాత హర్యానాలోని గురుగ్రామ్లో మరో భారీ రీసైక్లింగ్ ప్లాంట్ నెలకొల్పాడు. ప్రస్తుతం 200కు పైగా కంపెనీలతో టై అప్ అయ్యి.. ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ వ్యాపారాన్ని దాదాపు రూ.30 కోట్ల టర్నోవర్కు చేర్చాడు.
ప్లాస్టిక్ లేదా ఈ-వేస్ట్ రీసైక్లింగ్ బిజినెస్ ఇలా ప్రారంభించండి..
చాలా కంపెనీలు ఈ- వ్యర్థాలను సాధారణంగా స్టోర్ రూంలో ఉంచి కొన్నాళ్లయ్యాక చెత్తలో పడేస్తుంటారు. వీటిని కొనుగోలు చేస్తే ఇరువురికి లాభాలు ఉంటాయి. పర్యావరణానికి మేలు జరుగుతుంది.
స్థానికంగా ఉండే ఐటీ, ఆటోమొబైల్, కన్సల్టింగ్, ఫార్మాస్యూటికల్స్, ఫైనాన్షియల్ సెక్టార్, టెలికమ్యూనికేషన్స్, కన్సూమర్ గుడ్స్, హెవీ ఇండస్ట్రీస్ తదితర రంగాలకు చెందిన కంపెనీలతో ఈ-వేస్ట్ అమ్మేలా డీలింగ్ కుదుర్చుకోండి. వీటిని సేకరించాక మీరు ఏర్పాటు చేసిన ప్లాంట్ ద్వారా రీసైక్లింగ్ చేసి.. తిరగి ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ సంస్థలకు ముడిపదార్థాలుగా మంచి రేటుకు అమ్ముకోవచ్చు.
ముద్ర రుణాలు: ఈ తరహా వ్యాపారాల కోసం కేంద్రప్రభుత్వం ముద్ర స్కీం కింద రూ.50,000 నుంచి రూ.10 లక్షల వరకూ లోన్ అందిస్తోంది. ఈ డబ్బుతో రీసైక్లింగ్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేసి వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
రిజిస్ట్రేషన్ : వ్యాపారం ప్రారంభించే ముందుగా మీ సేవ కేంద్రానికి వెళ్లి కంపెనీ పేరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఓ ప్యాన్ కార్డ్ ఇస్తారు. నలుగురి కంటే ఎక్కువమంది పనివారిని పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే
లేబర్ సర్టిఫికేట్ తప్పక తీసుకోవాలి. మీ సేవా కేంద్రం ద్వారా పెట్టుబడి ఖర్చు, ప్రభుత్వ సబ్సిడీ, రీసైక్లింగ్ యంత్రాలు ఎలా పొందాలి.. తదితర పూర్తి వివరాలు విచారించుకోవచ్చు.
Read Also : వీధులే... ద్రాక్ష తోటలు
Gold Crossing 1 lakh: ఈ సంవత్సరం బంగారం ధర
SugarCane Juice: ప్రతిరోజు చెరకు రసం తాగవచ్చా.. తాగితే ఏమవుతుంది..