ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పూనమ్ గుప్తా
ABN , Publish Date - Apr 03 , 2025 | 03:05 AM
ప్రముఖ ఆర్థికవేత్త పూనమ్ గుప్తాను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ప్రభుత్వం నియమించింది. కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఇందుకు ఆమోదముద్ర వేసింది...

న్యూఢిల్లీ: ప్రముఖ ఆర్థికవేత్త పూనమ్ గుప్తాను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ప్రభుత్వం నియమించింది. కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఇందుకు ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ఆమె నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్) డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మూడేళ్ల పాటు గుప్తాఈ పదవిలో ఉంటారు. జనవరిలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైకేల్ డి పాత్రా పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో పూనమ్ గుప్తాను ప్రభుత్వం నియమించింది. ఆర్థిక శాస్త్రంపై గట్టి పట్టు ఉన్న ఆమె ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకుతో సహా పలు సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రధాని ఆర్థిక సలహా మండలిలోనూ ఆమె సభ్యురాలు.
ఇవి కూడా చదవండి:
Loan Charges: ఏప్రిల్లో పర్సనల్ లోన్స్పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Read More Business News and Latest Telugu News