Meerpet Madhavi Case: వీడిన మాధవి మర్డర్ మిస్టరీ.. కుక్కర్‌లో కాదు.. ఏకంగా పొటాషియం హైడ్రాక్సైడ్‌తో..

ABN, Publish Date - Jan 25 , 2025 | 01:00 PM

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మీర్‌పేట మాధవి హత్య కేసులో సంచనల విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ సైనికుడైన గురుమూర్తి తన భార్యను దారుణంగా హత్య చేయడమే కాకుండా అత్యంత పాశవికంగా శరీరా భాగాలను ఉడికించి మరీ మృతదేహం ఆనవాళ్లు లేకుండా చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా విచారించగా ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి..

Meerpet Madhavi Case: వీడిన మాధవి మర్డర్ మిస్టరీ.. కుక్కర్‌లో కాదు.. ఏకంగా పొటాషియం హైడ్రాక్సైడ్‌తో..

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మీర్‌పేట మాధవి హత్య కేసులో సంచనల విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ సైనికుడైన గురుమూర్తి తన భార్యను దారుణంగా హత్య చేయడమే కాకుండా అత్యంత పాశవికంగా శరీరా భాగాలను ఉడికించి మరీ మృతదేహం ఆనవాళ్లు లేకుండా చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా విచారించగా ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కేసు నుంచి ఎలాగైనా తప్పించుకోవడానికి నిందితుడు మృతదేహం భాగాలను కుక్కర్‌లో కాకుండా హీటర్ సాయంతో విడతల వారీ ఉడికించాడని తెలిసింది. ఇందుకోసం అతను పొటాషియం హైడ్రాక్సైడ్‌ వాడినట్లు పోలీసులు గుర్తించారు.


మీర్‌పేట్ మాధవి మర్డర్ కేసు (Meerpet Madhavi Case) రాష్ట్రంలోనే అరుదైన కేస్‌గా పోలీసులు తేల్చారు. పోలీసు విచారణలో తాజాగా ఒళ్లు గుగుర్పొడిచే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో క్లూస్‌ను సేకరించేందుకు పోలీసులు అత్యాధునిక టెక్నాలజీ వాడినట్లు తెలిసింది. నిందితుడు గురుమూర్తి తన భార్యను దారుణంగా హత్య చేయడమే కాకుండా మృతదేహాన్ని మాయం చేసేందుకు ఎంతో తెలివిగా ప్లాన్ చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికిన తర్వాత.. వాటిని ఉడికించడానికి పొటాషియం మైడ్రాక్సైడ్ ద్రావణం సాయంతో ఉడికించాడు. అలాగే మృతదేహాన్ని నరికేందుకు కత్తి, చెక్క, మొద్దును కూడా వినియోగించాడని తెలిసింది. అయితే వీటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


కారణాలివేనా..

నిందితుడు గురుమూర్తికి మాధవి బంధువుల అమ్మాయితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై దంపలు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఇటీవల వారి బంధువుల ఇంట్లో జరిగిన వేడుకల్లో అత్తమామలు వ్యవహరించిన తీరు గురుమూర్తికి మరింత కోపం తెప్పించినట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధంతో పాటూ అత్తమామలు చేసిన అవమానం మనసులో పెట్టుకున్న అతను తరచూ భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ చేసుకునేందుకు భార్య, పిల్లలతో కలిసి నగరంలోని తన సోదరి ఇంటికి వెళ్లాడు. పిల్లలకు సెలవులు కావడంతో అక్కడే వదిలేసి జనవరి 14న భార్యను తీసుకుని ఇంటికి వచ్చాడు. ఆ మరుసటి రోజు రాత్రి భార్యతో గొడవపడిన గురుమూర్తి.. ఆగ్రహంతో తలపై బలంగా బాదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.


ఆనవాళ్లను ఎలా గుర్తించారంటే..

భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న గురుమూర్తి.. ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడేందుకు మృతదేహం ఆనవాళ్లు లేకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో రాత్రంతా యూట్యూబ్‌లో వీడియోలు చూసి జనవరి 16న మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లి ముక్కలు చేశాడు. ఆ రోజంతా అదే పనిలో ఉన్న నిందితుడు.. రాత్రి వాటిని బకెట్లో వేసి హీటర్‌తో ఉడికించాడు. ఇందుకోసం పొటాషియం మైడ్రాక్సైడ్ ద్రావణాన్ని వినియోగించాడు. ఎముకలను పొడిచేసిన తర్వాత దాన్ని బాత్రూం ఫ్లస్ ద్వారా డ్రైనేజీలోకి పంపించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దారుణాన్ని అతను మూడు రోజుల పాటు చేసినట్లు తెలిసింది. ఆ సమయంలో ఇంటి యజమాని తన కుటుంబంతో సహా బెంగళూరులో ఉన్నాడు. అలాగే పిల్లలు కూడా ఇంట్లో లేకపోవడంతో ఈ ఘాతుకం బయటికి రాలేదు. మరోవైపు వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతిని పెళ్లి చేసుకోవడం కోసమే ఇలా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆనవాళ్లు లేకుండా చేయడానికి నిందితుడు ఎంతగానో ప్రయత్నించినా కూడా మృతదేహాన్ని ముక్కలు చేసిన మొద్దు, గదిలోని వస్తువులపై మానవ అవశేషాలను పోలీసులు బ్లూరేస్ టెక్నాలజీ ద్వారా కనిపెట్టగలిగారు.

Updated Date - Jan 25 , 2025 | 01:00 PM