PM Modi WithTrump : అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ.. ట్రంప్తో పాటు మస్క్తో భేటీ..!
ABN, Publish Date - Feb 13 , 2025 | 11:58 AM
PM Modi US Visit: ప్రస్తుతం ప్రధాని మోదీ రెండు రోజుల అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈరోజు ఆయన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో సమావేశం కానున్నారు. వాణిజ్యం నుంచి వీసా వరకు అనేక అంశాలపై ఇద్దరు నాయకుల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రధానమంత్రి మోదీ చేస్తున్న ఈ పర్యటన భారత్-అమెరికాల భవిష్యత్తు దిశను నిర్ణయించబోతోంది.

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం వాషింగ్టన్లో ఉన్నారు. ఆయన ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కూడా సమావేశం కానున్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా గెలిచాక రెండు దేశాల అధినేతలకు ఇదే మొదటి సమావేశం అవుతుంది. ట్రంప్, మోదీలు చాలా ఏళ్లుగా మంచి స్నేహితులుగా మెలుగుతున్నారు. మోదీ నాకు సన్నిహితుల్లో ఒకరని ట్రంప్ తరచూ చెప్పడాన్ని బట్టి వీరిద్దరి మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలను అర్థం చేసుకోవచ్చు. ఈసారి కూడా అలాంటి సానుకూల వాతావరణంలోనే చర్చలు సాగే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.
మోదీకి స్వయంగా ఆతిథ్యం ఇవ్వనున్న ట్రంప్..
ట్రంప్ తొలిసారిగా 2016లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పదవీ బాధ్యతలు చేపట్టిన ఒక సంవత్సరం తర్వాత ఆయన వాషింగ్టన్లో ప్రధాని మోదీని కలిశారు. ఈ సారి రెండు నెలలు పూర్తి కాకుండానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీతో భేటీ అవడం విశేషం. ఇదేకాక నూతన అమెరికా అధ్యక్షుడిని తొలిసారి కలిసిన తొలి దక్షిణాసియా దేశాధినేత ప్రధాని మోదీనే కావచ్చు. రెండు రోజుల పర్యటన నిమిత్తం వాషింగ్టన్ చేరుకున్న భారత ప్రధానికి డోనాల్డ్ ట్రంప్ స్వయంగా ఆతిథ్యం ఇస్తారు. ట్రంప్తో భేటీలో పలు కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు. ఇప్పటికే మంచి స్థితిలో ఉన్న అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం.
మస్క్తో భారత ప్రధాని భేటీ..!
ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి నిలువరించేందుకు శాంతి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ప్రధాని మోదీ పర్యటన జరుగుతోంది. రెండు రోజుల అమెరికా పర్యటనలో ట్రంప్తో వాణిజ్యం, రక్షణ, ఇంధన సహకారం వంటి అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ చర్చించనున్నారు. ఇది మాత్రమే కాదు, H-1 వీసా, ఉగ్రవాదం, ఇండో-పసిఫిక్ ప్రాంతం, USలో దాక్కున్న గ్యాంగ్స్టర్లు వంటి అంశాలను కూడా చర్చించవచ్చు. ఈ భేటీలో ట్రంప్ మంత్రివర్గంలోని పలువురు సభ్యులతో పాటు భారతీయ-అమెరికన్లతోనూ ప్రధాని మోదీ సమావేశమవుతారు. స్పేస్ఎక్స్, టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్లను కూడా కలిసే అవకాశముంది. భారతదేశంలో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటుపై మస్క్తో భారత ప్రధాని చర్చిస్తారని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
Mark Zuckerberg: దేవుడిని అవమానిస్తూ ఫొటోలు.. పాకిస్తాన్లో నాకు మరణశిక్ష పడేలా ఉంది: జుకర్బర్గ్
Donald Trump: పుతిన్కు ట్రంప్ ఫోన్
Hajj 2025: హజ్ యాత్రకు పిల్లల్ని అనుమతించరు
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Feb 13 , 2025 | 11:58 AM