Share News

Split Ukraine Plan: ఉక్రెయిన్‌ను బెర్లిన్‌లా విభజిద్దాం

ABN , Publish Date - Apr 14 , 2025 | 03:35 AM

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ముగించేందుకు అమెరికా రాయబారి కీత్‌ కెల్లాగ్‌ నియంత్రణ మండలాలుగా విభజన ప్రతిపాదించారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో వ్యాఖ్యలు వక్రీకరించబడ్డాయని ఆయన వివరణ ఇచ్చుకున్నారు

Split Ukraine Plan: ఉక్రెయిన్‌ను బెర్లిన్‌లా విభజిద్దాం

  • యుద్ధాన్ని ముగించడానికి అమెరికా రాయబారి కీత్‌ కెల్లాగ్‌ సూచన

  • వివాదాస్పదం కావడంతో వక్రీకరించారంటూ వివరణ

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 13: దాదాపు మూడేళ్లకు పైగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపేందుకు యత్నిస్తోన్న అమెరికా కొత్త ఫార్ములా తీసుకొచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బెర్లిన్‌ను విభజించినట్లే ఉక్రెయిన్‌ను కూడా నియంత్రణ మండలాలుగా విభజించాలని అమెరికా ప్రత్యేక రాయబారి జనరల్‌ కీత్‌ కెల్లాగ్‌ సూచించారు. బ్రిటీష్‌, ఫ్రెంచ్‌ బలగాలు పశ్చిమ ఉక్రెయిన్‌లో భరోసా దళంగా ఉంటాయని, ఇప్పటికే ఆక్రమించిన తూర్పు ప్రాంతాలపై రష్యన్‌ బలగాలు నియంత్రణ కొనసాగిస్తాయన్నారు. నిస్సైనిక మండలాల్లో రెండు దేశాల బలగాలు ప్రవేశించే అవకాశం లేదు కాబట్టి ఘర్షణలకు తావుండదన్నారు. ఇది వివాదం కావడంతో కెల్లాగ్‌ వివరణ ఇచ్చుకున్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. ఉక్రెయిన్‌ను విభజించడం తన యోచన కాదన్నారు. ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని కాపాడే చర్యల్లో భాగంగా సైనిక పునరుద్ధరణ గురించి మాట్లాడానన్నారు. కాగా, ఉక్రెయిన్‌లోని సుమీ నగరంపై రష్యా ఆదివారం జరిపిన క్షిపణి దాడుల్లో 32 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అమెరికా ప్రతినిధి విట్కాఫ్‌ సమావేశమైన రెండు రోజుల వ్యవధిలోనే ఈ దాడి జరిగింది. అమెరికా, యూరప్‌ దేశాలు రష్యా చర్యను గట్టిగా విమర్శించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ

AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..

TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

For International News And Telugu News

Updated Date - Apr 14 , 2025 | 03:35 AM