Amit shah: మణిపూర్‌లో శాంతిభద్రతలపై సమీక్ష.. అమిత్‌షా కీలక ఆదేశాలు

ABN, Publish Date - Mar 01 , 2025 | 04:53 PM

మార్చి 8వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని మార్గాల్లోనూ ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలకు సాగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను అమిత్‌షా ఆదేశించారు. ప్రజల రాకపోకలను అడ్డుకోవడం, రోడ్ల దిగ్బంధనాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Amit shah: మణిపూర్‌లో శాంతిభద్రతలపై సమీక్ష.. అమిత్‌షా కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ: జాతుల మధ్య వైరంతో రెండేళ్లుగా అట్టుడుకుతున్న మణిపూర్‌ (Manipur)లో శాంతి భద్రతల పరిస్థితిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) శనివారంనాడు సమీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న మణిపూర్‌లో భద్రతా పరిస్థితులపై ఉన్నత స్థాయి అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. మార్చి 8వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని మార్గాల్లోనూ ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలకు సాగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను అమిత్‌షా ఆదేశించారు. ప్రజల రాకపోకలను అడ్డుకోవడం, రోడ్ల దిగ్బంధనాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

PM Modi: ప్రపంచ శక్తిగా భారత్ మారుతోంది: మోదీ


మణిపూర్ అంతర్జాతీయ సరిహద్దు వెంబటి డిజిగ్నేటెడ్ ఎంట్రీ పాయింట్లకు ఇరువైపులా ఫెన్సింగ్ వర్క్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, మాదకద్రవ్యాల బెడద లేని రాష్ట్రంగా మణిపూర్‌ను తీర్చిదిద్దాలని, డ్రగ్ ట్రేడ్ నెట్‌వర్క్‌ను సమూలంగా నిర్మూలించాలని హోం మంత్రి ఆదేశాలు ఇచ్చారు. నార్త్ ఎవెన్యూలో మధ్యాహ్నం 11 గంటలకు జరిగిన ఈ కీలక సమావేశంలో మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఆర్మీ, పారామిలటరీ అధికారులు హాజరయ్యారు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన అనంతరం అక్కడి పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరగడం ఇదే మొదటిసారి.


మణిపూర్‌లో 2023 మేలో మెయితీ, కుకీ జాతుల మధ్య తలెత్తిన వైరం తీవ్రమైన హింసాకాండకు దారితీయడంతో సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ఇటీవల రాజీనామా చేయడంతో ఫిబ్రవరి 13న మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. శాంతిని నెలకొల్పే చర్యల్లో భాగంగా ప్రజలు తమ వద్ద ఉన్న అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్ధాలను వారంరోజుల్లోగా అప్పగించాలని గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఫిబ్రవరి 20న విజ్ఞప్తి చేశారు. వారం రోజుల వ్యవధిలో 300కు పైగా ఆయుధాలను ప్రజలు అప్పగించినట్టు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి

Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్‌ అవినీతిపై పర్వేష్ వర్మ

Congress: కేరళ కాంగ్రెస్‌ నేతల భేటీకి థరూర్‌

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 01 , 2025 | 04:56 PM