PM Modi: నేను తాగుతున్న నీళ్లు కూడా అవే... ఆప్పై మోదీ నిప్పులు
ABN , Publish Date - Jan 29 , 2025 | 03:08 PM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఘోండా శాసనసభ నియోజకవర్గంలో జరిగిన సభలో ప్రధాని బుధవారంనాడు మాట్లాడుతూ, యుమునా జలాల ప్రక్షాళనలో ఆప్ విఫలమైనందునే హేయమైన ఆరోపణలు చేస్తోందన్నారు.

న్యూఢిల్లీ: 'యమునా జలాల యుద్ధం' ముదురుతోంది. ఢిల్లీకి సరఫరా చేసే నీటిలో బీజేపీ "విషం'' కలపడం ద్వారా ప్రజలను హతమార్చాలని చూస్తోందని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) చేసిన వ్యాఖ్యలపై ప్రధాన నరేంద్ర మోదీ మండిపడ్డారు. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి తాగే నీటిలో విషం కలపగలదా? అని ప్రశ్నించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఘోండా శాసనసభ నియోజకవర్గంలో జరిగిన సభలో ప్రధాని బుధవారంనాడు మాట్లాడుతూ, యుమునా జలాల ప్రక్షాళనలో ఆప్ విఫలమైనందునే హేయమైన ఆరోపణలు చేస్తోందన్నారు.
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా తొక్కిసలాటపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం..
''యమున పేరుతో ఓట్లడిగారు. ఇప్పుడు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఢిల్లీని నీళ్లు అడుక్కునేలా చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం పాపాలకు పాల్పడుతున్నారు. చరిత్ర ఎన్నటికీ వాళ్లను క్షమించదు. ఢిల్లీ ఎప్పటికీ క్షమించదు. బీజేపీ మాత్రం ప్రజలకు స్వచ్ఛమైన జలాలను అందిస్తుంది'' అని మోదీ అన్నారు.
ఆప్ ప్రభుత్వం చేసిన నిందారోపణలను హర్యానా ప్రభుత్వం మరిచిపోదని ప్రధాని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే ఆప్ నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతోందని ఆక్షేపించారు. హర్యానా ప్రజలు ఢిల్లీలో నివసించడం లేదా? అప్పుడు ఢిల్లీ జలాలను ఎలా విషమయం చేస్తుంది? ప్రధాని కూడా ఈ జలాలే తాగుతున్నారు.. అని మోదీ పేర్కొన్నారు.
ఇరవై ఒకటవ శతాబ్దంలో 25 ఏళ్లు ముగిసిపోయాయని, మొదటి 14 ఏళ్లు కాంగ్రెస్ హాయాంలో చోటుచేసుకున్న విపత్తు, ఇప్పుడు ఆప్ విపత్తు చూశామని, రెండూ కలిసి రెండు జనరేషన్లను పతనం చేశాయని మోదీ ఆరోపించారు. ఇవాళ కూడా ఢిల్లీలో ఆవే రోడ్ జామ్లు, వీధుల్లో మురికినీరు, కలుషిత తాగునీరు పరిస్థితి ఉందని, తాము 11 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసి, మరో 25 ఏళ్లు పనులు కొనసాగించనున్నామని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ
Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్షా 3 సవాళ్లు
Read More National News and Latest Telugu News