Nitin Gadkari: హైవేల బలోపేతానికి 10 లక్షల కోట్లు
ABN , Publish Date - Apr 14 , 2025 | 04:06 AM
రహదారుల బలోపేతానికి కేంద్రం 10 లక్షల కోట్లు ఖర్చు చేస్తుంది, ఇందులో ఈశాన్య రాష్ట్రాలు మరియు సరిహద్దు ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు గడ్కరీ తెలిపారు. రానున్న రెండు సంవత్సరాల్లో ఈశాన్య రహదారుల స్థాయి అమెరికా హైవేలా ఉండటానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల బలోపేతానికి వచ్చే రెండేళ్లలో రూ.10 లక్షల విలువైన ప్రాజెక్టులు చేపడతామని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈశాన్య రాష్ట్రాలు, సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. రానున్న రెండు సంవత్సరాల్లో ఈశాన్యంలోని రోడ్లు అమెరికాతో సమానంగా ఉంటాయన్నారు. ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో గడ్కరీ మాట్లాడుతూ.. తూర్పు రాష్ట్రాల్లో రూ.3.73 లక్షల కోట్ల అంచనాతో 21,355 కిలోమీటర్ల మేర 784 హైవే ప్రాజెక్టులు చేపట్టనున్నామని తెలిపారు. వాటిల్లో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, ఎన్హెచ్ఏఐ, ఎన్హెచ్ఐడీసీఎల్ ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే అసోం, బిహార్ తదితర రాష్ట్రాల్లో రూ.వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Capital Amaravati: మరో 30 వేల ఎకరాల భూ సమీకరణకు రంగం సిద్ధం
IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్లు బదిలీ
AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు
Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..
TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
For National News And Telugu News