Home » Nitin Jairam Gadkari
దేశంలో మౌలిక వసతుల అభివృద్ధి కీలకమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రోజుకు 100 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
రహదారుల బలోపేతానికి కేంద్రం 10 లక్షల కోట్లు ఖర్చు చేస్తుంది, ఇందులో ఈశాన్య రాష్ట్రాలు మరియు సరిహద్దు ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు గడ్కరీ తెలిపారు. రానున్న రెండు సంవత్సరాల్లో ఈశాన్య రహదారుల స్థాయి అమెరికా హైవేలా ఉండటానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు
హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ వ్యయంలో 50 శాతాన్ని భరిస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
దేశంలోని 25 వేల కిలోమీటర్ల మేర రెండు లేన్ల రహదారులను నాలుగు లేన్ల రహదారులుగా మారుస్తామని కేంద్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
రెండు నెలల్లో రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)కు సంబంధించిన పెండింగ్ అంశాలను పూర్తిచేసి, పనులను ప్రారంభించేలా చూస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.
తెలంగాణకు మంజూరు చేసిన రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) పనుల్లో వేగం పెంచాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్గడ్కరీతో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ కానున్నారు.
జాతీయ రహదారి 65కి ఉత్తర భాగంలోని ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్పై పునరాలోచన చేస్తామని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు.
తెలంగాణ లోని జాతీయ రహదారుల అభివృద్ధి పనుల కోసం 2014 నుంచి ఇప్పటి వరకు రూ.31 వేల కోట్ల నిధులు కేటా యించినట్లు కేంద్రం తెలిపింది.
దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని, అంతర్జాతీయ సదస్సుల్లో ఈ అంశం ప్రస్తావనకు వస్తే సమాధానం చెప్పలేక సిగ్గుతో ముఖాన్ని దాచుకోవాల్సి వస్తోందని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
భారతదేశం రూ.22 లక్షల కోట్లు విలువచేసే శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటోందని, ఆర్థిక, పర్యావరణ, జీవావరణ పరంగా ఇదొక సవాలని గడ్కరి చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం ద్వారా శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించవచ్చని అన్నారు.