Share News

ED vs Congress: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ నోటీసులు

ABN , Publish Date - Apr 14 , 2025 | 04:01 AM

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ జారీ చేసిన నోటీసులపై రాజ్యసభ ఎంపీ కపిల్‌ సిబల్‌ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని కూలదొచ్చే కుట్రలో భాగంగా ఈ చర్యలు తీసుకుందని ఆరోపించారు

ED vs Congress: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ నోటీసులు

‘ప్రజాస్వామ్యంపై దాడి’: సిబల్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 13: నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కేసులో స్థిరాస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ కపిల్‌ సిబల్‌ ఆదివారం తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ఏజెన్సీలను వినియోగిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ కేసులో ఈడీ నోటీసులు జారీ చేయడాన్ని ఆయన ‘ప్రజాస్వామ్యంపై దాడి’గా అభివర్ణించారు. హిందూ-ముస్లిం అజెండాపై బీజేపీ రాజకీ యాలు చేయాలనుకుంటోందని, విపక్షాన్ని అంతమొందించాలనుకుంటోందని మీడియా సమావేశంలో ఆయన మండిపడ్డారు. వార్తాపత్రికకు సంబంధించిన భవనాల్లో కాంగ్రెస్‌ కార్యాలయాలు నడుస్తున్నందున వాటిని స్వాధీన పరచుకుని పార్టీ పని చేయకుండా చేసేందుకు నోటీసులు జారీ చేసినట్టు ఆయన చెప్పారు. అయితే 13 ఏళ్లు ఎందుకు వేచి చూశారని ఆయన నిలదీశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Capital Amaravati: మరో 30 వేల ఎకరాల భూ సమీకరణకు రంగం సిద్ధం

IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ

AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..

TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

For National News And Telugu News

Updated Date - Apr 14 , 2025 | 04:01 AM