Bihar: 17న బిహార్లో మహా కూటమి పార్టీల భేటీ
ABN , Publish Date - Apr 14 , 2025 | 03:45 AM
బిహార్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు మహా కూటమి పార్టీల భేటీ ఈ నెల 17న జరగనుంది. సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్లేషణ

అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపైచర్చ.. సీఎం అభ్యర్థిగా తేజస్వి?
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13 : బిహార్లో కాంగ్రెస్, ఆర్జేడీలతో కూడిన ఆరు పార్టీల మహా కూటమి ఈ నెల 17న సమావేశం కానుంది. ఈ ఏడాది అక్టోబరులో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. కూటమి పార్టీల మధ్య ఈ విషయమై ఇప్పటి వరకు ఎటువంటి సమావేశం జరగలేదని కాంగ్రెస్ నాయకుడొకరు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహాన్ని రచించేందుకు ఈ సమావేశం ఎంతో ముఖ్యమైనదని ఆయన అన్నారు. సీట్ల పంపకంపైనా ప్రాథమిక చర్చలు జరపనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ కూటమి ఇప్పటి వరకు సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాతే సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలెట్ ఇటీవల చెప్పారు. అయితే ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్నే సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
Capital Amaravati: మరో 30 వేల ఎకరాల భూ సమీకరణకు రంగం సిద్ధం
IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్లు బదిలీ
AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు
Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..
TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
For National News And Telugu News