Platform Tickets Suspend: ఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ టిక్కెట్లు బంద్.. మరిన్ని కీలక మార్పులు
ABN , Publish Date - Feb 17 , 2025 | 07:40 PM
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఇటివల తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 26 వరకు ప్లాట్ఫామ్ టిక్కెట్ల అమ్మకాలను రైల్వే శాఖ నిలిపివేసింది. దీంతోపాటు మరిన్ని కీలక నిర్ణయాలు కూడా అమలు చేస్తున్నారు.

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ (Delhi Railway Station)లో శనివారం రాత్రి జరిగిన భారీ తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయిన క్రమంలో టిక్కెట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26, 2025 వరకు ప్లాట్ఫామ్ టిక్కెట్ల అమ్మకాలను నిలిపివేయాలని నిర్ణయించారు. అంటే మొత్తానికే టిక్కెట్స్ ఇవ్వరని కాదు, ప్రయాణికులు మాత్రమే టిక్కెట్లు తీసుకుని ప్లాట్ఫారమ్లోకి రావాలని స్పష్టం చేశారు. ఇతరులకు స్టేషన్ లోపలికి అనుమతి ఉండదు. కానీ వృద్ధుల కోసం కొన్ని ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేశామని, వారిని అనుమతిస్తామని అధికారులు అన్నారు.
ఎంట్రీ పాయింట్ వద్ద నియంత్రణ
దీంతోపాటు జనసమూహం నియంత్రణకు సంబంధించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రధానంగా రైల్వే స్టేషన్ వెలుపల బారికేడింగ్ ఏర్పాటు చేశారు. స్టేషన్లో ప్రవేశించే ప్రయాణీకులకు, వారి టికెట్ ఆధారంగా మాత్రమే ప్లాట్ఫామ్లోకి ప్రవేశించే అనుమతి ఉంటుంది. ఈ విధానాన్ని అమలు చేయడానికి, టికెట్ చెక్ చెయ్యడానికి భద్రతా పద్ధతులను అమలు చేస్తున్నారు. ప్రధానంగా TT (ట్రెయిన్ టైమర్లు), RPF (రైల్వే పోలీస్ ఫోర్స్) జవాన్లను ఆయా ప్రాంతాల్లో మోహరించారు. ప్రయాణీకుల సంఖ్య ఎక్కువగా ఉంటే, టికెట్ కన్ఫర్మ్ అయినప్పటికీ, వారికి రైలు కొంచెం దగ్గరగా వచ్చిన తరువాత మాత్రమే ప్లాట్ఫామ్లోకి అనుమతిస్తారు.
జనసమూహం నిర్వహణకు ప్రత్యేక సూచనలు
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జనసమూహం ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక రక్షణ చర్యలను అమలు చేస్తున్నారు. జనరల్, స్లీపర్ కోచ్ల దగ్గర భద్రతా సిబ్బందిని పెంచారు. అలాగే ప్రయాణికులు వరుసగా నిలబడే విధంగా సూచనలు జారీ చేశారు. ప్రయాణీకులు రైలు వస్తున్నప్పుడు గందరగోళం లేకుండా వరుసగా నిలబడాలని సూచించారు. ఈ చర్యలతో ప్రయాణికులు మరింత సురక్షితంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేచి ఉండే ప్రాంతాలు
ఇతర స్టేషన్లలోని భారీ జనసమూహాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ విధానంలో రైల్వే స్టేషన్ వెలుపల కూడా ప్రత్యేకంగా వేచి ఉండే ప్రాంతాలు ఏర్పాటు చేశారు. అక్కడ ప్రయాణీకులు రైలు సమయాన్ని, ప్రయాణానికి సంబంధించిన సమాచారాన్ని పొందుతారు.
ఆ క్రమంలో రైలు వస్తుందన్న సమాచారం తర్వాత ప్లాట్ఫామ్లోకి ప్రయాణీకులను మాత్రమే అనుమతిస్తారు. ఇలా చేయడం ద్వారా ఒకేసారి జనం ఎక్కువగా వెళ్లే అవకాశం ఉండదు. మహా కుంభమేళా చివరి దశకు చేరుకుంటున్న క్రమంలో ప్రయాగ్రాజ్కు వెళ్లే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు జనసమూహాన్ని నియంత్రించడానికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
Viral News: పార్లమెంటులో అబద్ధం చెప్పిన ఎంపీ.. ఫైన్ విధించిన కోర్టు, పదవి కూడా..
CBSE Board Exam 2025: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష పేపర్ లీక్.. బోర్డ్ క్లారిటీ
New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..
New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..
BSNL: రీఛార్జ్పై టీవీ ఛానెల్లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Read More Business News and Latest Telugu News