Share News

VP Jagdeep Dhankhar: ప్రభుత్వమే ఫైనల్‌

ABN , Publish Date - Apr 03 , 2025 | 05:18 AM

ప్రజాస్వామ్యంలో పాలన చేయాల్సింది కార్యనిర్వాహక వ్యవస్థ మాత్రమేనని, కోర్టులు పాలనలో జోక్యం చేసుకోకూడదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పేర్కొన్నారు. పార్లమెంటుకు, ప్రజలకు ప్రభుత్వమే జవాబుదారి అని రాజ్యసభలో నిర్వహించిన చర్చలో స్పష్టం చేశారు

VP Jagdeep Dhankhar: ప్రభుత్వమే ఫైనల్‌

పాలన చేయాల్సింది కార్యనిర్వాహక వ్యవస్థ మాత్రమే.. కోర్టులు కాదు

పార్లమెంటుకు, ప్రజలకు అదే జవాబుదారీ ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2: ప్రజాస్వామ్యంలో పరిపాలన చేయాల్సింది కార్యనిర్వాహక వ్యవస్థ మాత్రమేనని.. న్యాయస్థానాలు కాదని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ స్పష్టం చేశారు. పార్లమెంటుకు, ప్రజలకు కార్యనిర్వాహక వ్యవస్థే జవాబుదారీగా పేర్కొన్నారు. బుధవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా జాతీయ అర్హత-ప్రవేశ పరీక్ష (నీట్‌)ను వికేంద్రీకరించాలంటూ డీఎంకే సభ్యురాలు కనిమొళి ఎన్‌వీఎన్‌ సోము చేసిన డిమాండ్‌పై కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పందించారు. ఇది డీఎంకే భాగస్వామిగా ఉన్న యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానమని.. నీట్‌ను కేంద్రీకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్‌ జోక్యం చేసుకున్నారు. ‘ప్రభుత్వమే ఫైనల్‌. ప్రభుత్వం తన కార్యనిర్వాహక అధికారాన్ని కోర్టుతో కలిసి పంచుకోగలదా? ప్రజాస్వామ్యంలో కార్యనిర్వాహక వ్యవస్థ మాత్రమే పాలన చేయాలి. ఎందుకంటే అదే పార్లమెంటుకు, ప్రజలకు జవాబుదారీ. దేశాన్ని పాలించేందుకు ప్రజలు దానిని ఎన్నుకుంటారు. అందుచేత ఈ అంశంపై దృష్టి సారించండి’ అని సూచించారు.


ఇవి కూడా చదవండి:

Summer Icecream: వేసవిలో ఐస్ క్రీం తింటున్నారా లేదా ఫ్రోజెన్ డెజర్ట్ తింటున్నారా.. రెండింటికీ తేడా ఏమిటి..

AP Police Search For Kakani: హైదరాబాద్‌లోని కాకాణి నివాసానికి ఏపీ పోలీసులు..

Updated Date - Apr 03 , 2025 | 05:18 AM