వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ
ABN, Publish Date - Apr 15 , 2025 | 03:02 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. మంగళవారం రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో ఉదయం 11.00 గంటలకు ఈ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను కేబినెట్ తీసుకుంది. అందులోభాగంగా ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు సైతం ఆమోదించింది. నిర్మాణ పనులను ఎల్1 బిడ్డర్కు అప్పగించాలని నిర్ణయించింది. స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది. పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

కేబినెట్ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ చెబుతున్న మాటలను శ్రద్ధగా వింటున్న సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు

ఉదయం 11.00 గంటలకు కేబినేట్ సమావేశం ప్రారంభమైంది.

కేబినెట్ సమావేశానికి హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు

కేబినెట్ భేటీకి హాజరైన సీఎం చంద్రబాబుతోపాటు ఇతర ఉన్నతాధికారులు

కేబినెట్కు హాజరైన మంత్రులు

కేబినెట్ భేటీలో మాట్లాడుతోన్న సీఎం చంద్రబాబు నాయుడు

కేబినెట్ భేటీకి హాజరైన మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నారా లోకేష్ తదితరులు
Updated at - Apr 15 , 2025 | 03:06 PM