సుంకరమెట్టలో ఉడెన్ బ్రిడ్జ్.. ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్..

ABN, Publish Date - Apr 08 , 2025 | 06:37 PM

Pawan Kalyan: విశాఖ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సుంకరమెట్టలో ఉడెన్ బ్రిడ్జి ప్రారంభించారు. ఎకో టూరిజం టూరిజం అభివృద్ధికి అనేక కార్యక్రమాలకు అంకురార్పణ చేశారు. ఆ విశేషాల సమాహారమే ఇది..

సుంకరమెట్టలో ఉడెన్ బ్రిడ్జ్.. ప్రారంభించిన  డిప్యూటీ సీఎం పవన్.. 1/7

ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా అరకు మండలంలోని సుంకరమెట్ట కాఫీ ఎస్టేట్స్ లో ఏర్పాటు చేసిన చెక్క వంతెనను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.

సుంకరమెట్టలో ఉడెన్ బ్రిడ్జ్.. ప్రారంభించిన  డిప్యూటీ సీఎం పవన్.. 2/7

అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజున రూ.19 లక్షల అంచనా వ్యయంతో కాఫీ తోటల మధ్య నిర్మించిన చెక్క వంతెనను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

సుంకరమెట్టలో ఉడెన్ బ్రిడ్జ్.. ప్రారంభించిన  డిప్యూటీ సీఎం పవన్.. 3/7

కాఫీ తోటల మధ్య ఉడెన్ బ్రిడ్జ్ పై కెనోపీ వాక్ చేస్తూ ఆద్యంతం కాఫీ తోటల అందాలను ఆస్వాదించారు. సిల్వర్ ఓక్ చెట్ల మధ్య వేసిన కాఫీ మొక్కలు, ఎత్తయిన మొక్కలపైకి పాకిన మిరియాల పంటల సాగుపై ఆరా తీశారు.

సుంకరమెట్టలో ఉడెన్ బ్రిడ్జ్.. ప్రారంభించిన  డిప్యూటీ సీఎం పవన్.. 4/7

వంతెనపై ఏర్పాటు చేసిన ట్రీడెక్స్, పక్షి గూడు ఆకారంలో ఏర్పాటు చేసిన బర్డ్ నెస్ట్ లను ఆసక్తిగా తిలకిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించారు. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన ఫోటో గ్యాలరీని తిలకించారు.

సుంకరమెట్టలో ఉడెన్ బ్రిడ్జ్.. ప్రారంభించిన  డిప్యూటీ సీఎం పవన్.. 5/7

ఎకో టూరిజం అభివృద్ధికి అటవీశాఖ అధికారులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. కాఫీ తోటల అభివృద్ధి, ఎకో టూరిజం అభివృద్ధికి సంబంధించి అధికారులకు సూచనలు చేశారు. ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని అభివృద్ధి చేయాలని కోరారు.

సుంకరమెట్టలో ఉడెన్ బ్రిడ్జ్.. ప్రారంభించిన  డిప్యూటీ సీఎం పవన్.. 6/7

ఈ సందర్భంగా అరకు డిలైట్ కాఫీ బ్రాండ్ ప్రోమోషన్ తో పాటు సుంకరమెట్ట ఎకో టూరిజం పోస్టర్లు, బ్రోచర్లను శ్రీ పవన్ కళ్యాణ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు.

సుంకరమెట్టలో ఉడెన్ బ్రిడ్జ్.. ప్రారంభించిన  డిప్యూటీ సీఎం పవన్.. 7/7

ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ కజూరియా, విశాఖ రీజన్ ఫారెస్ట్ చీఫ్ కర్జర్వేటర్ డాక్టర్ జ్యోతి తుల్లిమెల్లి, జిల్లా కలెక్టర్ శ్రీ దినేష్ కుమార్, గ్రామ సర్పంచ్ శ్రీ గెమ్మిలి చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated at - Apr 08 , 2025 | 06:37 PM