Share News

పంత్‌కు రూ. 12 లక్షల జరిమానా

ABN , Publish Date - Apr 06 , 2025 | 04:51 AM

ముంబైతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించారు. లఖ్‌నవూ బౌలర్లు...

పంత్‌కు రూ. 12 లక్షల జరిమానా

దిగ్వేష్‌ మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత

లఖ్‌నవూ: ముంబైతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించారు. లఖ్‌నవూ బౌలర్లు నిర్ణీత సమయంలో పూర్తి చేయాల్సిన దానికంటే ఓ ఓవర్‌ వెనుకబడ్డారు. దీంతో ఆఖరి ఓవర్‌లో రింగ్‌ వెలుపల ఓ ఫీల్డర్‌ను తగ్గించాల్సి వచ్చింది. ఇదే తొలి తప్పిదం కావడంతో సారథి పంత్‌కు రూ. 12 లక్షలు జరిమానా విధించినట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, లఖ్‌నవూ స్పిన్నర్‌ దిగ్వేష్‌ రాఠీ రెండోసారి ఐపీఎల్‌ క్రమశిక్షణ కోడ్‌ను ఉల్లంఘించడంతో అతడి మ్యాచ్‌ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు. నమన్‌ ఽధిర్‌ అవుటైన తర్వాత కూడా అతడు మరోసారి నోట్‌బుక్‌ సెలబ్రేషన్స్‌ చేసుకొన్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ ఫీజులో సగం కోతతోపాటు రెండు డీమెరిట్‌ పాయింట్లు అతడి ఖాతాలో చేరాయి.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 06 , 2025 | 04:52 AM