Vemulawada: ‘రాజన్న’ ధర్మగుండం.. నిండా దుర్గంధం!
ABN , Publish Date - Feb 21 , 2025 | 05:27 AM
భక్తులు ఎంతో పవిత్రంగా భావించి స్నానాలు ఆచరించే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి క్షేత్రంలోని ధర్మగుండం తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది.

వేములవాడ కల్చరల్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): భక్తులు ఎంతో పవిత్రంగా భావించి స్నానాలు ఆచరించే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి క్షేత్రంలోని ధర్మగుండం తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. చాలా రోజులుగా ఈ నీటిని మార్చకపోవడంతో ముక్కుపుటాలు అదిరిపోయే దుర్గంధం వెలువడుతోందని, దీంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 25 నుంచి 27 వరకు మహాశివరాత్రి జాతర ఉండటంతో వారం రోజుల ముందు నుంచే రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.