ఫిర్యాదులపై చట్టప్రకారమే చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Apr 01 , 2025 | 11:08 PM
పోలీ స్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే వి చారణ చేపట్టి చట్టప్రకారమే చర్యలు తీసుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు కళ్యాణ్కుమార్కు సూ చించారు.

గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ శ్రీనివాసరావు
గద్వాల క్రైం, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): పోలీ స్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే వి చారణ చేపట్టి చట్టప్రకారమే చర్యలు తీసుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు కళ్యాణ్కుమార్కు సూ చించారు. మంగళవారం గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీచేశారు. పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. సిబ్బంది విధులపై ఆరా తీశారు. స్టేషన్కు వచ్చే ప్రతీ ఫి ర్యాదుదారునితో సిబ్బంది గౌరవంగా మెలగాల ని చెప్పారు. రాత్రివేళల్లో పట్టణంలో గస్తీ సి బ్బందిని పెంచాలని, పగలు తిరిగే బ్లూకోల్ట్స్ సి బ్బందిని అలర్ట్గా ఉంచాలని ఆదేశించారు. ఆ యా కేసుల్లో పట్టుబడిన వాహనాలను కోర్టు అ నుమతి తీసుకొని డిస్పోజల్ చేయాలని ఎస్ఐని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగుల య్య, సీఐ టి.శ్రీను ఉన్నారు.