Kavitha: కేసీఆర్పై కోపంతో అంబేడ్కర్ను అవమానిస్తున్నారు: కవిత
ABN , Publish Date - Apr 14 , 2025 | 05:12 AM
మాజీ సీఎం కేసీఆర్పై కోపంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంబేడ్కర్ను అవమానిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

హైదరాబాద్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్పై కోపంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంబేడ్కర్ను అవమానిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రులు అంబేడ్కర్ స్మృతివనాన్ని సందర్శించి నివాళులర్పించాలని సూచించారు. గత ఏడాది అంబేడ్కర్ జయంతికి ముఖ్యమంత్రి, మంత్రులెవరూ 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించలేదన్నారు.